For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ ద్రవిడ్​.. టీమిండియా హెడ్ కోచ్​ అవుతారా?!

Is Rahul Dravid in line to become next Team India head coach.

ముంబై: జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ) డైరెక్టర్​ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 15ను చివరి తేదీగా బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 14 రాత్రి 1.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రస్తుతం ఎన్​సీఏ డైరెక్టర్​ పదవిలో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్​ ద్రవిడ్ కొనసాగుతున్నారు. 'ది వాల్' ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనకు కోచ్‌గా వ్యవహరించారు. యువ ఆటగాళ్లను తనదైన శైలిలో ముందుకునడిపించాడు.

రాహుల్ ద్రవిడ్.. రెండేళ్ల కాలానికిగానూ 2019 జులైలో జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ) డైరెక్టర్​గా బాధ్యతలు​ తీసుకున్నారు. దీంతో పాటు భారత అండర్​-19, భారత-ఏ జట్లకు కోచ్​గా వ్యవహరిస్తున్నారు. ది గ్రేట్ వాల్ ఆధ్వర్యంలో చాలామంది యువ క్రికెటర్లు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా రిజర్వ్​ బెంచ్​ను బలంగా తయారుచేయడంలో ద్రవిడ్ పాత్ర ఎంతో కీలకం. దీంతో ఈ పదవికి ద్రవిడ్ తిరిగి దరఖాస్తు చేసే అవకాశముంది. ఒకవేళ ద్రవిడ్ ఈసారి కూడా దరఖాస్తు చేస్తే.. ఎన్​సీఏ డైరెక్టర్​గా బాధ్యతలు చేపట్టడం ఖాయమే.

'రాహుల్ ద్రవిడ్​ ఎన్​సీఏ పదవికి మరోమారు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​ తర్వాత భారత కోచ్​ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్​ భారత కోచ్​గా నియామకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి' అని బీసీసీఐ సంబంధిత వర్గాలు అంటున్నాయి. 'జాతీయ క్రికెట్​ అకాడమీ డైరెక్టర్​గా ఎంపికైన వ్యక్తి యువ ఆటగాళ్లకు సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. ఆటగాళ్ల సన్నద్ధత, వారి ప్రదర్శన మెరుగుపర్చడానికి కృషి చేయాలి. భారత్-ఏ, అండర్​-23, అండర్​-19, అండర్​-16 ఆటగాళ్లు, రాష్ట్రాల అసోసియేషన్ల ప్లేయర్లకు సంబంధించి బాధ్యత ఎన్​సీఏ డైరెక్టర్​దే' అని బీసీసీఐ స్పష్టం చేసింది.

శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ భారత్.. ఇటీవల పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం శ్రీలంకలో పర్యటించింది. ఈ యువ జట్టు​కు రాహుల్ ద్రవిడ్​ కోచ్​గా వ్యవహరించారు. 2-1తో వన్డే సిరీస్​ను గెలుపొందిన గబ్బర్ సేన.. 2-1తో టీ20 సిరీస్​ను మాత్రం కోల్పోయింది. కరోనా వ్యాప్తి కారణంగా పలువురు స్టార్ ఆటగాళ్లు చివరి రెండు మ్యాచ్​లకు దూరమయ్యారు. దీంతో భారత్ టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. రానున్న టీ20 ప్రపంచకప్​లో భారత్​ ఒకవేళ అత్యుత్తమ ప్రదర్శన చేయకపోతే రవిశాస్త్రి భారత కోచ్​ పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కోచ్​ పదవీకి 60 ఏళ్ల గరిష్ఠ వయసును నిర్దేశించింది బీసీసీఐ. రవిశాస్త్రికి ప్రస్తుతం 59 ఏళ్లు. అంతేకాదు కోహ్లీ-శాస్త్రిలు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్​​ కూడా గెలువలేదు. దీంతో టీ20 ప్రపంచకప్​ గెలవడం తప్పనిసరి అయింది. లేకపోతేవేటు తప్పకపోవచ్చు.

Story first published: Tuesday, August 10, 2021, 23:17 [IST]
Other articles published on Aug 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+