ధోనికి థ్యాంక్ నోట్ చదివి వినిపించిన ఆటగాళ్లు
మూడో టీ20కి ముందు బెంగుళూరులో టీమిండియా బస చేసిన హోటల్లో జరిగిన ఈ ప్రైవేట్ కార్యక్రమానికి ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటగాళ్లందరూ థ్యాంక్ నోట్ను కూడా చదవి వినిపించారు.

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ధోని రిటైర్మెంట్?
పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి ధోని వీడ్కోలు పలికిన తర్వాత ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతారనే వార్తలు వచ్చాయి. తాజాగా బీసీసీఐ ధోనిపై చేసిన వ్యాఖ్యలు ఈ విషయానికి బలం చేకూర్చుతున్నాయి.

హోటల్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన రోహిత్ శర్మ
అంతేకాదు గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరిస్కు దూరమైన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హాజరవ్వడం ఈ వార్తలకు బలమిస్తోంది. నిజానికి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా 2019 వరల్డ్ కప్లో ఆడాలని ఉన్నట్లు ధోని తన మనసులోని మాటను బయట పెట్టాడు. కానీ బీసీసీఐ ప్రయత్నాలను చూస్తుంటే ధోనికి ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి సిరిస్ అవుతుందని అంటున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీనే ధోనికి చివరి సిరిస్?
ఇదే గనుక నిజమైతే స్వదేశంలో ధోని తన చివరి మ్యాచ్ని ఆడినట్లే. ఈ క్రమంలో ధోని తన రిటైర్మెంట్పై నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి. ధోని కెప్టెన్సీలో టీమిండియా 2007లో ఐసీసీ వరల్డ్ టీ20, 2011లో ఐసీసీ వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











