హైదరాబాద్: వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020లో ఆడని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితమే వారితో కలిసి పంటపొలాలకు వెళ్లి విందు భోజనం చేశాడు. తాజాగా కుటుంబ సభ్యుల కోసం వంట కూడా చేశాడు. రైనా సాధారణ వ్యక్తిలా మట్టిపాత్రలో వంట చేయడం విశేషం. రైనా తన వంటకు సంబందించిన ఫొటోలను సామాజిక మధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు.
ఇంట్లో వంట చేస్తున్న వీడియోను సురేష్ రైనా తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసి.. 'శీతాకాలంలో వంట చేయడం గొప్ప అనుభూతి, అలవాటు' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీడియో చూసిన టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సరదాగా స్పందిచాడు. 'రైనా బ్రో.. నా కోసం చేస్తున్నావా?' అని సరదాగా కామెంట్ చేశాడు. దీనిని వందల మంది అభిమానులు రీట్వీట్ చేశారు.
సురేష్ రైనా గత ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో పాల్గొనలేదు. తొలుత చెన్నై జట్టు సభ్యులతో యూఏఈ వెళ్లినా.. వ్యక్తిగత కారణాలతో తిరిగి భారత్కు చేరుకున్నాడు. తన ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నాడు.
ఐపీఎల్లో 193 మ్యాచ్లాడిన సురేశ్ రైనా 137.11 స్ట్రైక్రేట్తో ఏకంగా 5,368 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చెన్నై టీమ్లో ఈ రికార్డ్లు ఏ బ్యాట్స్మెన్కి లేవు. రైనా స్థానంలో ఆడుతున్న అంబటి రాయుడు ఒక మ్యాచ్లో మినహా ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ తేలిపోయాడు. కీలక మూడో స్థానంలో సరైన ఆటగాడు లేక చెన్నై సతమతమవుతోంది. గత ఆగస్టు 15న రైనా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు.
ఐదు విమానాలు.. 40రోజుల క్వారంటైన్.. ఎంతో కష్టపడి భారత్ చేరుకున్న రాయ్ కృష్ణ!!