
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్టాఫ్ ఇండియా
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్టాఫ్ ఇండియా ఆరంభంలోనే అన్మోల్ ప్రీత్ (15) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి మయాంక్ ధాటిగా ఇన్నింగ్స్ను నడిపించారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాచ్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన మయాంక్ ఆ తర్వాత కూడా జోరు ప్రదర్శిస్తూ 75 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.

రెండో సెషన్లో చెలరేగిన విహారి
ఆ తర్వాత రెండో సెషన్లో విహారి చెలరేగిపోవడంతో పాటు విదర్భ బౌలర్ సర్వతే ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన అతను 75 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న మయాంక్... మరో భారీ షాట్కు ప్రయత్నించి మిడాఫ్లో గుర్బానీకి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత రెస్టాఫ్ బ్యాటింగ్ తడబడింది. ఒకరి వెంట మరొకరు వేగంగా పెవిలియన్ చేరారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విహారికి ఇది 16వ సెంచరీ
టాపార్డర్లో కెప్టెన్ అజింక్యా రహానె (13), శ్రేయస్ అయ్యర్ (19) విఫలమయ్యారు. ఇషాన్ కిషన్ (2), కృష్ణప్ప గౌతమ్ (7), ధర్మేంద్రసిన్హ్ జడేజా (6) కూడా నిరాశపర్చారు. దీంతో రెస్టాఫ్ 72 పరుగుల తేడాతో ఐదు వికెట్లను కోల్పోయింది. ఒక్కో బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూకడుతున్నా.. విహారి ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విహారికి ఇది 16వ సెంచరీ.

రెండో రోజు బ్యాటింగ్కు దిగనున్న విదర్భ
అంకిత్ రాజ్పుత్ (25) సహకారంతో హనుమ విహారి జట్టు స్కోరును 300 దాటించాడు. చివర్లో రాహుల్ చహర్ (22) విహారికి అండగా నిలిచాడు. విదర్భ బౌలర్లలో ఆదిత్య సర్వాటే, అక్షయ్ వఖారే మూడేసి వికెట్లు పడగొట్టగా.. రజ్నేష్ రెండు, యశ్ ఠాకూర్, అక్షయ్ కర్నేవర్ తలో వికెట్ తీసుకున్నారు. రెండో రోజు బ్యాటింగ్కు దిగనున్న విదర్భ భారీ స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది.


Click it and Unblock the Notifications












