తమ హోమ్ మ్యాచ్కు అర్ధగంట ముందు
ప్రతి ఫ్రాంచైజీ తమ హోమ్ మ్యాచ్కు అర్ధగంట ముందు ఈ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఆయా నగరాల్లో ఉండే సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా తొలుత బుధవారం హైదరాబాద్లో ఆరంభ వేడుకలు ప్రారంభమవుతాయి.
ఉప్పల్ స్టేడియంలో ఆరంభ వేడుకలు
బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్కు ముందు ఉప్పల్ స్టేడియంలో ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అరగంట సేపు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ నటి అమీ జాక్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
సాయంత్రం 6:20కి ప్రారంభ వేడుక మొదలు
రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 6:20కి ప్రారంభ వేడుక మొదలుకానుంది. తొలుత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్లు గోల్ఫ్ కార్ట్లలో మైదానంలోకి ప్రవేశిస్తారు. ఆపై వీరి ఘనతలు, సాధించిన రికార్డులను గురించి ప్రస్తావిస్తూ, ఆడియో, వీడియో ప్రదర్శన ఉంటుంది.
కామెంటేటర్గా రవిశాస్త్రి
అనంతరం ఐదుగురు క్రికెటర్లు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి రవిశాస్త్రి కామెంటేటర్గా వ్యవహరించనున్నారు. తర్వాత బాలీవుడ్ నటి అమీ జాక్సన్ 300 మంది డ్యాన్సర్లతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఆపై ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ప్రదర్శన ఉంటుంది. కాగా, రెహమాన్ పెర్ఫార్మెన్స్ అధికారికంగా ప్రకటితమైనా, ఆయన వచ్చే విషయమై కొంత సందిగ్ధత నెలకొనివుంది.
చీఫ్ గెస్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
ఇక ఈ ఆరంభ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీఫ్ గెస్ట్గా రానున్నారు. ఈసారి ఐపీఎల్ కోసం కొత్తగా హే దస్ సాల్ ఆప్ కే నామ్ పేరుతో ఓ గీతాన్ని రూపొందించారు. బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, టైగర్ష్రాఫ్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఆయా నగరాల్లో జరిగే వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. రాజ్కోట్లో జరిగే కార్యక్రమంలో ధూమ్ మచాలే సాంగ్కు టైగర్ డాన్స్ చేయనున్నట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఈడెన్లో జరిగే ఐపీఎల్ వేడుకలకు బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హాజరు కానుంది.