IPL 2025: ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. ఐపీఎల్ ఇదే రోజున అంటే ఏప్రిల్ 18, 2008న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి సీజన్లో టైటిల్ను గెలుచుకుంది.
మొదటి ఫోర్ కొట్టిన ఆటగాడు ఎవరు?
ఏప్రిల్ 18, 2008న బెంగళూరులో ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ లో మొదటి పరుగు బ్యాట్ నుంచి రాలేదు కానీ లెగ్ బైగా వచ్చింది. ఈ పరుగు ప్రవీణ్ కుమార్ బౌలింగ్ లో వచ్చింది. ఇది కాకుండా ఐపీఎల్లోని మొదటి ఫోర్ న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ బ్యాట్ నుంచి వచ్చింది. జహీర్ ఖాన్ వేసిన బంతికి మెకల్లమ్ ఈ ఫోర్ కొట్టాడు.

మొదటి వికెట్ తీసిన బౌలర్ ఎవరు?
ఐపీఎల్లో తొలి వికెట్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్కు దక్కింది. ఆ సమయంలో జహీర్ ఖాన్ ఆర్సీబీ జట్టులో భాగంగా ఉన్నాడు. ఆ మ్యాచ్ లో ఆరో ఓవర్ రెండో బంతికి జహీర్ ఖాన్ తన తొలి ఐపీఎల్ వికెట్ తీసుకున్నాడు. జహీర్ ఖాన్ తన తొలి వికెట్ ను సౌరవ్ గంగూలీ రూపంలో తీసుకున్నాడు. తొలి మ్యాచ్లోనే సౌరవ్ గంగూలీ క్యాచ్ ఔట్ అయ్యాడు. గంగూలీ క్యాచ్ను జాక్వెస్ కలిస్ స్లిప్లో తీసుకున్నాడు.
ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి ఐదుగురు బ్యాటర్లు వీరే..
1.విరాట్ కోహ్లీ( 8,004)
2. శిఖర్ ధావన్(6,769)
3.రోహిత్ శర్మ(6,628)
4.డేవిడ్ వార్నర్(6,565)
5.సురేష్ రైనా(5,528)