చెన్నై, ముంబై కెప్టెన్లు:
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఈ రూ.100కోట్ల క్లబ్లో చేరారు. ఈ పదకొండు ఐపీఎల్ సీజన్లలో ఆ జట్టు ఫ్రాంఛైజీ నుంచి వీరు ఒక్క వేతనం రూపంలోనే రూ.100కోట్లు పైగా సంపాదించేశారు. ధోనీ అత్యధికంగా రూ.107.8 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా రూ.101.6 కోట్లతో రోహిత్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.
రూ.6కోట్లకు చెన్నై సూపర్కింగ్స్కు ధోనీ:
2008లో ఐపీఎల్ తొలి సీజన్ కోసం నిర్వహించి వేలంలో ధోనీని చెన్నై సూపర్కింగ్స్ రూ.6కోట్లకు కైవసం చేసుకుంది. అప్పటి నుంచి 2015 వరకు ధోనీ అదే ఫ్రాంఛైజీకి నాయకత్వం వహించాడు. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆ ఫ్రాంఛైజీపై రెండేళ్ల పాటు నిషేధం విధించారు.
ధోనీ.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కు:
2016, 2017 సీజన్లలో ధోనీ.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించాడు. తిరిగి ఈ ఏడాది చెన్నై సూపర్కింగ్స్ను నడిపించాడు. ఈ పునరాగమనంలోనే జట్టును ట్రోఫీ విజేతగా నిలబెట్టాడు. ముప్పై కి పైబడిని వారందరినీ జట్టులోకి తీసుకుంటున్నారనే విమర్శలను ఎదుర్కొంటూ, గాయాలపాలై జట్టులోని ఆటగాళ్లు దూరమవుతున్న ఒడిదుడుకులను తట్టుకుంటూ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించారు.
11 ఐపీఎల్ సీజన్ల ద్వారా రూ.100కోట్లకు పైగా:
అలాగే ఐపీఎల్ ప్రారంభ సీజన్లో డెక్కన్ ఛార్జర్స్కు ప్రాతినిధ్యం వహించిన రోహిత్ శర్మ రూ.3కోట్లు పలికాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్లో చేరాడు. మూడుసార్లు ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు. అరంగేట్ర సీజన్ నుంచి రోహిత్ ధర గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఐపీఎల్-11వ సీజన్లో ధోనీ, రోహిత్ కోసం ఆ జట్టు ఫ్రాంఛైజీలు రూ.15కోట్లు వెచ్చించాయి. ఈ లెక్కన వీరిద్దరూ పదకొండు ఐపీఎల్ సీజన్ల ద్వారా రూ.100కోట్లకు పైగా సంపాదించారు. ఇంకా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లతో పాటు ట్రోఫీ గెలిచినప్పుడు అందుకునే ప్రైజ్ మనీ దీనికి అదనం.