కోల్కత్తా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ20 టోర్నమెంట్లో పూణె జట్టుకు చీఫ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లీమింగ్ను నియమిస్తూ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పూణె ప్రాంఛైజీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ సూచన మేరకు స్టీఫెన్ ఫ్లెమింగ్ను చీఫ్ కోచ్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్స్లో స్టీఫెన్ ప్లెమింగ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చీఫ్ కోచ్గా వ్యవహరించారు. అయితే స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
పూణె ప్రాంజైజీ జట్టు ఓనర్ సంజయ్ గోయెంకా న్యూజిలాండ్ మాజీ కెప్టన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ను చీఫ్ కోచ్గా నియమించడాన్ని స్వాగతించారు. భారత్లో అత్యంత ఖరీదైన టోర్నమెంట్గా పేరొందిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను రెండు సార్లు టైటిల్ బరిలో నిలపడంలో ధోని, ఫ్లెమింగ్లు కీలక పాత్ర పోషించారు.
ఈ ఏడాది ఐపీఎల్ వేలం పాటలో తొలి ఆటగాడిని ఎంచుకునే బాధ్యత పూణె జట్టుకు లభించిన సంగతి తెలిసిందే. పూణె జట్టులో రవిచంద్రన్ అశ్విన్, డుప్లెసిస్, అజ్యంకె రహానే, స్టీవెన్ స్మిత్ లాంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది.