
కోల్ కత్తా నైట్ రైడర్స్ లోని విదేశీ ఆటగాళ్లకు, దేశీ ఆటగాళ్లకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందని ఆయన చెప్పారు. ఒక భారత ఆటగాడు తనకు ఈ విషయం చెప్పినట్లు జడేజా తెలిపాడు. తాను భారత అటగాడినని, తనకు కోల్ కత్తా నైట్ రైడర్స్ లోని చాలా మంది ఆటగాళ్లు తనకు తెలుసునని, ఒక భారత ఆటగాడిని మైదానం వెలుపలికి రమ్మని పిలిచారని, దానికి ఆ ఆటగాడు కారణం అడగ్గా యూ ఇండియన్, యూ డూ వాట్ ఐ ఆస్క్ యూ టు డు అని విదేశీ కోచ్ ల్లో ఒకతను అన్నాడని ఆయన వివరించారు. ఆటగాళ్ల మధ్య విభజన రేఖ ఉందని, ఆలోచనా సరళిలోనూ విభజన ఉందని, సౌరవ్ గంగూలీ ఆలోచనా సరళి వేరని ఆయన అన్నారు.