|
సన్రైజర్స్ తొలి మ్యాచ్
ఐపీఎల్ 2022లో ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడనుంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ను మార్చి 29న రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు జరగనుంది. రెండో మ్యాచ్ను ఏప్రిల్ 4న పుణే సూపర్ జెయింట్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ డివై పాటిల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఏప్రిల్ 9న మూడో మ్యాచ్లో చెన్నైసూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ డివై పాటిల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది.
కోల్కతా, ఆర్సీబీతో మ్యాచ్లు
ఇక నాల్గో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఏప్రిల్ 11న జరగనున్న ఈ మ్యాచ్ డివై పాటిల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. ఐదో మ్యాచ్ను ఏప్రిల్ 15న కోల్కతానైట్ రైడర్స్తో ఆడనుంది. బ్రబౌర్న్ స్డేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంబం కానుంది. ఇక ఆరో మ్యాచ్ను ఏప్రిల్ 17న డివై పాటిల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఏడో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 23న బ్రబౌర్న్ వేదికగా రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఇలా 14 మ్యాచ్ల్లోని సగం మ్యాచ్లు ముగియనున్నాయి.
చెన్నై, ఢిల్లీతో మ్యాచ్లు ఎప్పుడంటే..
ఇక ఏప్రిల్ 27 నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ మిగతా సగం మ్యాచ్లను ఆడనుంది. 27న గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది రైజర్స్కు లీగ్లో ఎనిమిదో మ్యాచ్. ఇక తొమ్మిదో మ్యాచ్లో చెన్నైసూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ మే 1న పుణేలోని ఎంసీఏ స్డేడియం వేదికగా జరగనుంది. మే 5న తన పదో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ బ్రబౌర్న్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక 11వ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ మే 8న వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.
ముంబై, కోల్కతాతో మ్యాచ్లు ఎప్పుడంటే..
మే 14న జరగనున్న 12వ మ్యాచ్లో కోల్కతానైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక 13వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా మే 17న రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఇక ఐపీఎల్ 2022లో తన చివరి మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా మే 22న రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా మొత్తం ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్ల్లోనూ ఇదే చివరిది.