హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చెత్త ప్రదర్శన ప్రభావం వన్డే వరల్డ్కప్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఎంతమాత్రం ఉండబోదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. ఈ సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంతమాత్రం కలిసి రాలేదు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడటంతో ఆ జట్టు అభిమానులు డీలా పడిపోయారు. ముఖ్యంగా ఈ సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ విభాగం పేలవంగా తయారైంది. భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేక ఆ జట్టు చేతులెత్తేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు వరుసగా ఆరు మ్యాచ్లాడిన ఆర్సీబీ అన్ని మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది.
ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ తన ట్విట్టర్లో "కోహ్లీ, డివిలియర్స్పైనే ఆర్సీబీ అతిగా ఆధారపడుతోంది. ఆర్సీబీ మిడిలార్డర్ అనుకున్నంతగా రాణించడం లేదు. డెత్ ఓవర్లలో వారి బౌలింగ్ పేలవంగా ఉంది. ప్లాన్స్ను అనుకున్న విధంగా అమలు చేయడం లేదు. కాబట్టి ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం త్వరగా చర్చించి పరిస్థితుల్లో మార్పు తేవాలి" అంటూ ట్వీట్ చేశాడు.
#HoggsVlog: Will RCB's poor form affect KOHLI during the World Cup? Should Warner lead SRH in the absence of Williamson?
— Brad Hogg (@Brad_Hogg) April 12, 2019
I'm answering YOUR questions once again - it's time for #AskHoggy. Join the chat, and let me know if you agree with what I had to say. It's #hoggytime! pic.twitter.com/JUb8KVsT9C
ఈ సీజన్లో ఆర్సీబీ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంపై ఆ జట్టు అభిమానులు సైతం నిరాశలో కూరుకుపోయారు. కాగా, టోర్నీలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తదుపరి మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో తలపడనుంది. ఈ మ్యాచ్కి మొహాలీలోని పంజాబ్ క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.