హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్కు చేరకుండానే నిష్ర్కమించింది. చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో 11 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అదే, ఈ మ్యాచ్లో ఢిల్లీపై విజయం సాధిస్తే ప్లేఆఫ్ వెళ్లేదే. కాగా, ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు ట్విట్టర్లో మెసేజ్ పోస్టు చేశాడు. 'టోర్నీ నుంచి నిష్క్రమించడం బాధాకరం. జీవితంలోనూ, ఆటలోనూ ఇలా జరుగుతుంటుంది. ప్రతిసారీ మనం కోరుకున్నది దక్కకపోవచ్చు. మేం చాలా పోరాడాం కానీ ఆ రోజు ప్రత్యర్థి మాకన్నా బాగా ఆడింది. వచ్చే ఏడాది ఇలా జరక్కుండా చూసుకుంటాం' అని ట్విట్ చేశాడు.
Disappointing to be out of the tournament, I guess that’s life and sport. We can’t always get what we want. We did fight hard but I guess the opposition were just a little better on the day. Will look to turn things around next year 😊
— Rohit Sharma (@ImRo45) May 21, 2018
ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే వరుస ఓటములతో సతమతమైంది. చివర్లో పుంజుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్లో రోహిత్ శర్మ కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో 300 పరుగులు చేయకపోవడం ఇదే తొలిసారి.