
హైదరాబాద్: విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్గేల్ ఐపీఎల్ వేలంలో రెండు రౌండ్లలో కొనుగోలు కాలేదు. చివరకి మూడో రౌండ్ వేలానికి రావడంతో ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. చివరికి పంజాబ్ జట్టు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ప్రీతి జింతా అతనిపై 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రారంభ ధరకి మించి ఒక్క రూపాయి కూడా గేల్కు కేటాయించదలచలేదు.
ఆదివారం అన్సోల్డ్ వేలం పాటలో భాగంగా తొలుత గేల్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కాగా, అమ్ముడుపోని క్రికెటర్లకు ఆఖర్లో మరొకసారి వేలం జరగ్గా గేల్ను కొనుగోలు చేయడానికి కింగ్స్ పంజాబ్ ఆసక్తి చూపింది. అతని కనీస ధర రూ. 2 కోట్లకే కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది.
ఒకానొక దశలో ఇదే ఐపీఎల్ వేలంలో రూ. 14కోట్ల వరకు పలికిన గేల్ ఇప్పుడు 2 కోట్లకే అమ్ముడవడం.. పాపం గేల్. అయితే న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు గప్టిల్కు మూడోసారి కూడా నిరాశే ఎదురైంది.
ఇదిలా ఉంటే గతేడాది నిర్వహించిన వేలంలో రూ. 12 కోట్లకు అమ్ముడుపోయిన ఇంగ్లాండ్ పేసర్ తైమాల్ మిల్స్ను ఈసారి ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబర్చలేదు. 2017లో జరిగిన వేలంలో తైమాల్ మిల్స్కు భారీ మొత్తం చెల్లించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.