టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా పడింది. గురువారం రాత్రి రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా ధోనీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. దీంతో మిస్టర్ కూల్కు చేదు అనుభవం ఎదురైంది.
చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం కాగా చివరి ఓవర్ అందుకున్న స్టోక్స్.. తొలి బంతి ఆఫ్స్టంప్ ఆవల వేయగా జడేజా సిక్స్ బాదాడు. తర్వాత బంతిని స్టోక్స్ నోబాల్ వేయగా.. జడేజా సింగిల్ తీశాడు. ఫ్రీహిట్కు ధోనీ రెండు పరుగులు తీశాడు. కానీ తర్వాతి బంతిని స్టోక్స్ యార్కర్ వేయగా ధోనీ బౌల్డయ్యాడు. దీంతో చెన్నై సమీకరణం చివరి మూడు బంతుల్లో 8 పరుగులకు మారింది.
నాలుగో బంతిని స్టోక్స్.. శాంట్నర్కు నడుంపైకి వేసాడు. దీంతో ప్రధాన అంపైర్ హైట్ నోబాల్గా ప్రకటించాడు. అయితే లెగ్ అంపైర్ కాదనడంతో.. ప్రధాన అంపైర్ వెంటనే చేతిని దించేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. క్రీజులో ఉన్న జడేజా అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే.. కెప్టెన్ ధోనీ ఆవేశంగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాదనకు దిగాడు. ధోనీ వాదించినా.. అంపైర్లు అది నోబాల్ కాదనడంతో చేసేదేమీలేక తిరిగి డగౌట్కు వెళ్ళిపోయాడు.
See this! I got this from somewhere.
— SOUL々MortaL (@ig_mortal) 12 April 2019
See dhoni🐯🐯🦁🦁🦁#MSDhoni #cskvsrr #RRvCSK pic.twitter.com/uxgoau2vY4
ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన చెన్నై కెప్టెన్ ధోనీపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ధోనీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఆఖరి దాకా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కీలక సమయంలో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ధోనీ (43 బంతుల్లో 58; 2 ఫోర్లు, 3 సిక్స్లు)కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.