హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో తొలి సెంచరీ నమోదైంది. టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ (102 నాటౌట్: 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీతో నమోదు చేశాడు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్లో ఓపెనర్ జోస్ బట్లర్ (5) ఆరంభంలోనే పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్.. మరో ఓపెనర్ అజింక్య రహానే (70: 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) కలిసి రెండో వికెట్కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 134 వద్ద రహానే ఔటయ్యాడు.
A fine century from Samson and a knock of 70 by the Skipper, propel @rajasthanroyals to a total of 198/2.
— IndianPremierLeague (@IPL) March 29, 2019
Will the @SunRisers chase the total down or will the @rajasthanroyals defend it?#VIVOIPL pic.twitter.com/7GqqysMxtO
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్స్టోక్స్ (16 నాటౌట్: 9 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజు శాంసన్ సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్లో సంజూ శాంసన్కి ఇది రెండో సెంచరీ. అంతేకాదు పిన్న వయసులో ఐపీఎల్లో రెండు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్గా సంజు శాంసన్(25 ఏళ్లు) రికార్డు సృష్టించాడు.
💯
— IndianPremierLeague (@IPL) March 29, 2019
That's a CENTURY from @IamSanjuSamson. His second in #VIVOIPL 👏👏#RRvSRH pic.twitter.com/ZM0k1Dlzpp