హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో తాను ఆడిన తొలి మ్యాచ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ముంబై ఇండియన్స్తో వాంఖడే వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో రిషబ్ పంత్ (78 నాటౌట్: 27 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
దీంతో ముంబై ఇండియన్స్కి ఢిల్లీ క్యాపిటల్స్ 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బౌలర్లలో బుమ్రాతో సహా అందరి బౌలింగ్లోనూ పంత్ సిక్సర్ల మోత మోగించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే పృథ్వీషా(7) వికెట్ను కోల్పోయింది. ఆపై కాసేపటికి శ్రేయస్ అయ్యర్(16) కూడా పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారిన ఓపెనర్ శిఖర్ ధావన్ (43: 36 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) జట్టుకి మెరుగైన ఆరంభమివ్వగా.. మిడిల్ ఓవర్లలో ఇంగ్రామ్ (47: 32 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్)తో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ 83 పరుగులు జత చేయడంతో ఢిల్లీ గాడిలో పడింది.
అయితే శిఖర్ ధావన్, ఇన్గ్రామ్లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు. 27 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్పర్లతో అజేయంగా 78 పరుగులు చేశాడు.
78* (27) 🔥
— IndianPremierLeague (@IPL) March 24, 2019
7 fours 👌
7 sixes 💪
Take a bow, @RishabPant777 🙌@DelhiCapitals have presented @mipaltan with a stiff target of 214. #MIvDC #VIVOIPL pic.twitter.com/pibkiDuxeF
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్గాన్ మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దిక్ పాండ్యా, బెన్ కట్టింగ్లు తలో వికెట్ తీశారు.