
బెట్టింగ్ను చట్టబద్ధం చేస్తే మంచిది
బెట్టింగ్ను చట్టబద్ధం చేయడం ద్వారా ఇది ఓ ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో పాటు బెట్టింగ్కు పాల్పడటం ద్వారా నమోదయ్యే కేసులు కూడా తగ్గుముఖం పడతాయని ఈ సందర్భంగా ప్రీతిజింటా చెప్పుకొచ్చారు. ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడకుండా ఉండేందుకు గాను ఐపీఎల్ విధివిధానాల్లో లై డిటెక్టర్ పరీక్షను సైతం చేరిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

బెట్టింగ్ చట్టబద్ధం చేస్తే లాభమిదే
ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో ప్రీతి జింటా మాట్లాడుతూ "బెట్టింగ్ను ప్రభుత్వం చట్టబద్ధం చేస్తే బాగుంటుంది. దీంతో ఇదొక ప్రధాన ఆదాయ వనరుగా ఏర్పడుతుంది. బెట్టింగ్కు పాల్పడుతున్న వారిలో ఎంతమందిని అని మనం కంట్రోల్ చేయగలం. ఐపీఎల్ పాలసీల్లో లై డిటెక్టర్ టెస్టుని కూడా చేర్చాలి" అని పేర్కొన్నారు.

తప్పకుండా పోలీసులను ఆశ్రయిస్తా
"అలా చేస్తే ఇదొక అద్భుతమే. దీని కారణంగా ప్రతి ఒక్కరూ భయపడతారు. ఫిక్సింగ్కు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎవరైనా ఫిక్సింగ్ ఆఫర్తో నా వద్దకు వస్తే నేను తప్పకుండా పోలీసులను ఆశ్రయిస్తా. నేను చెప్పేది అర్ధం చేసుకోండి, ప్రస్తుతం నేనేమీ సినిమాల్లో నటించడం లేదు" అని ప్రీతిజింటా తెలిపారు.

పదేళ్ల పాటు స్టూడియోల్లో, సినిమాల్లో నటించా
"పదేళ్ల పాటు నేను స్టూడియాల్లో, సినిమాల్లోని పాత్రల్లో కోసం కెమెరాల ముందు నటించాను. ప్రస్తుతం నేను లా లా ల్యాండ్లో నివసిస్తున్నాను. ఉన్నట్టుండి ఒక్కసారిగా క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాను. అయితే, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్ధం కావడం లేదు" ప్రీతిజింటా వెల్లడించారు.


Click it and Unblock the Notifications












