For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019లో చెన్నై బోణీ: బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో విజయం

IPL 2019-Chennai VS Bangalore|Chennai Won The 1st Match Of IPL 2019 | OneIndia Telugu
Suresh Raina


హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ తొలి బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 71 పరుగుల విజయ లక్ష్యాన్ని సీఎస్‌కే 17. 4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.

మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9) ధాటికి 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటవగా.. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టులో అంబటి రాయుడు (28: 42 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) రాణించడంతో చెన్నై జట్టు మరో 14 బంతులు మిగిలి లక్ష్యాన్ని ఛేదించేసింది.

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 70 పరుగులకే చాపచుట్టేసింది. ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌(29) మినహా ఎవరూ రెండంకెల స్కోరును చేయడంలో విఫలం కావడంతో ఆర్సీబీ మూడంకెల మార్కును చేరలేకపోయింది. ఆర్సీబీ జట్టులో విరాట్‌ కోహ్లీ(6), మొయిన్‌ అలీ(9), ఏబీ డివిలియర్స్‌(9) హెట్‌మెయిర్‌(0), శివం దుబే(2), గ్రాండ్‌ హోమ్‌(4)లు తీవ్రంగా నిరాశపరిచారు.

1
45757

చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో హర్బజన్‌ సింగ్‌ విజృంభించాడు. మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లు తీసి ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో హర్భజన్ మూడు వికెట్లు తీయగా... అతనికి జతగా ఇమ్రాన్‌ తాహీర్‌ మూడు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. డ్వేన్‌ బ్రేవోకు వికెట్‌ దక్కింది.

Story first published: Saturday, March 23, 2019, 23:23 [IST]
Other articles published on Mar 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+