ఫోటోలను పోస్ట్ చేస్తూ కన్ఫామ్ చేసిన మోడీ
బాలీవుడ్ నటి.. మాజీ మిస్ యూనివర్స్ అయిన సుస్మితాసేన్తో తాను డేటింగ్లో ఉన్నట్లు సంచలన ప్రకటన చేశాడు. అంతేకాకుండా సుస్మితాతో దిగిన ఫోటోలను కూడా పోస్టు చేశాడు. దీంతో క్రికెట్ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. అసలు ఇంతకీ లలిత్ మోదీ ఏమని ట్వీట్ చేశాడంటే.. 'ఇటీవలే కుటుంబంతో కలిసి చేసిన గ్లోబల్ టూర్ ముగిసింది. మేం మాల్దీవులు, సార్డినియా తదితర ప్రాంతాలకు టూర్కు వెళ్లొచ్చాక తర్వాత లండన్కు తిరిగి వచ్చాను. నా బెటర్హాఫ్ (అర్ధాంగి) సుస్మితా సేన్ గురించి చెప్పనక్కర్లేదు. ఎట్టకేలకు కొత్త జీవితాన్ని ప్రారంభించాను. చంద్రుడిపై ఉన్నట్లు ఉంది' అని లలిత్ మోడీ క్యాప్షన్ ఇచ్చాడు.
ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ..
ఇకపోతే సుస్మితా సేన్, లలిత్ మోడీ ఎప్పుడూ పెళ్లి చేసుకున్నారంటూ నెట్టింట క్వశ్చన్లు పోటెత్తాయి. ఇక ఈ విషయమై కూడా లలిత్ మోడీ క్లారిటీ ఇచ్చాడు. తాము ఇద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదని, కేవలం 'డేటింగ్' మాత్రమే చేస్తున్నామని లలిత్ మోడీ స్పష్టం చేశాడు. 'జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి ఈ ట్వీట్ చేస్తున్నా. మేం పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం డేటింగ్లో ఉన్నాం. ఏదో ఒక రోజు పెళ్లి ముచ్చట కూడా తీరుతుంది' అని లలిత్ మోడీ మరో ట్వీట్ చేశాడు.

మిస్ యూనివర్స్ కిరీటం పొందిన తొలి భారతీయ మహిళ
ఇకపోతే సుస్మితా సేన్ ఇటీవల మాల్దీవులలో తాను విహారయాత్రకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో పలు ఫోటోలను పంచుకుంది. ఆమె తన కుమార్తెలతో కలిసి మాల్దీవులను సందర్శించింది. ఇదే టైంలో సుస్మితాసేన్తో పాటు లలిత్ మోడీ కూడా ఈ టూర్కు వెళ్లినట్లు స్పష్టమైంది. ఇకపోతే 46ఏళ్ల సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్గా నిలిచింది. ఆమె ఇండియా నుంచి మిస్ యూనివర్స్గా ఎంపికైన తొలి మహిళగా పేరొందింది. అలాగే ఫెమినా మిస్ ఇండియా తదితర అవార్డులను కూడా ఆమె పొందింది. ఇకపోతే సుస్మితా సేన్ గతంలో విక్రమ్ బట్, రనదీప్ హుడా, వసీం అక్రమ్ తదితరులతో అఫైర్లు నడిపినట్లు వార్తలున్నాయి. ఆమె రోమాన్ షాల్తో కొన్నాళ్లు రిలేషన్ షిప్లో ఉంది. 2021 డిసెంబర్లో వీరిద్దరు విడిపోయారు. ఇక ఆమె పెళ్లి చేసుకోలేదు కానీ ఆమెకు రీని సేన్, అలీసా సేన్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


Click it and Unblock the Notifications












