
హైదరాబాద్: టీమిండియా అండర్ 19 జట్టు రాహుల్ ద్రవిడ్ కోచ్ నేతృత్వంలో దూసుకుపోతోంది. ఇదిలా ఉంచితే అండర్ 19 జట్టు ఆటగాళ్లకు ఐపీఎల్ వేలం మీదకు ధ్యాస మళ్లిందట. బంగ్లాదేశ్ జట్టుతో భారత్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఇలా ఐపీఎల్ గురించి ఆలోచించొద్దని ద్రవిడ్ వారికి గుర్తు చేస్తున్నాడు.
'మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. లక్ష్యం ఏమిటో, దేని కోసం పోరాడాలనుకున్నామో, కానీ ఇప్పడు మీ వైఖరి అలా లేదు. చిన్న చిన్న లక్ష్యాల కోసం ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఐపీఎల్ వేలం యేటా వస్తూనే ఉంటుంది. కానీ, వరల్డ్ కప్లో ఆడేందుకు మాత్రం అవకాశం అలా రాదు. నేను మీరు ఇక్కడ బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారని ఆశిస్తున్నాను.' అని కుర్రాళ్లకు వివరించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.