న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం 2018: ఆండ్రూ టైకి 7.2 కోట్లు, అమ్ముడుపోని తైమాల్ మిల్స్

By Nageshwara Rao
IPL Auction 2018, Day 2: KXIP purchase Andrew Tye for Rs 7.2 Cr; Tymal Mills unsold

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌ కోసం జరుగుతున్న వేలంలో ఊహించని విధంగా పలువురు ఆటగాళ్లు కోట్లు పలుకుతున్నారు. ఆదివారం జరిగిన వేలంలో ఆస్ట్రేలియా బౌలర్ ఆండ్రూ టై జాక్ పాట్ కొట్టాడు. ఆండ్రూ టైని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 7.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

రూ. కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆండ్రూ టై కోసం పంజాబ్, చెన్నై, రాజస్థాన్, ముంబై జట్లు పోటీ పడ్డాయి. అయితే చివరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో ఆండ్రూ టై అద్భుత ప్రదర్శన చేసిన ఫలితమే భారీ ధర పలకడానికి కారణమని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా ఐదో వన్డేలో ఆండ్రూ టై ఐదు వికెట్లు తీసుకోవడం విశేషం. దీంతో ఐపీఎల్‌ వేలానికి ముందే ఆండ్రూ టై ఫామ్‌లోకి రావడంతో అతడికి అదృష్టం కలిసొచ్చిందని చెబుతున్నారు. ఇంగ్లాండ్‌తో నాలుగో వన్డేలో మూడు వికెట్లు సాధించిన అండ్రూ టై అంతకముందు ఆడిన రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

ఇదిలా ఉంటే గతేడాది నిర్వహించిన వేలంలో రూ. 12 కోట్లకు అమ్ముడుపోయిన ఇంగ్లాండ్ పేసర్‌ తైమాల్‌ మిల్స్‌ను ఈసారి ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబర్చలేదు. 2017లో జరిగిన వేలంలో తైమాల్ మిల్స్‌కు భారీ మొత్తం చెల్లించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 28, 2018, 14:40 [IST]
Other articles published on Jan 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X