For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్-4: నేటి నుంచి ప్రారంభమైన వేలం పాట...

By Sindhu
IPL 4
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కోసం శనివారం వేలం పాటలు ప్రారంభం కానున్నాయి. ఈ వేలం పాటలో 350మంది ఆటగాళ్లు పాల్గొంటారు. క్రికెట్ అభిమానలు అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ వేలం పాటలకు అన్ని ఏర్సాట్లు పూర్తయ్యాయి. ఇక ఏఏ ప్రాంచైజ్ లు ఏ క్రీడాకారుడికి ప్రాదాన్యమిస్తుందనే విషయం ఆదివారం మాత్రమే తెలుస్తుంది. ఈ వేలం రేసులో ఉండే క్రీడాకారుల్లో పెద్ద వయస్కులైన నలుగురిపైనే అభిమానుల దృష్టి ప్రధానంగా కేంద్రీకృతమై ఉండటం విశేషం వారు బ్రియాన్ లారా(41.8సం//), సనత్ జయసూర్య(41.6సం//), ఆడమ్ గిల్ క్రిస్ట్(39.2సం//), సౌరవ్ గంగూలీ(38.6సం//)ఈ రేసులో ఎంతమేరకు పలుకుతారోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక పోతే..ఐపీఎల్ నాలుగో సీజన్ లో మొత్తం పది టీమ్ లు, 350 మంది క్రికెటర్లు, 74 మ్యాచ్ లు జరుగుతాయి. ఏప్రిల్ లో జరుగనున్న ఐపిఎల్-4లో ఆడే ఆటగాళ్ల ఎంపిక కోసం ఈ వేలం పాట బెంగళూరు వేదికగా శని, ఆదివారాల్లో జరగనుంది. గత ఏడాది వేలం పాటలో ఐపీఎల్ లీగ్ కు పురుడు పోసిన లలిత్ మోడీ, ఆర్థిక అవకతవకల ఆరోపణలతో దూరం కావడం, కొత్త ప్రాంచైజీలు కొచ్చి, పూణేలు అదనంగా చేరడం ఈ వేలంలో విశేషం.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+