For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్ భారత్‌లోనే నిర్వహించొచ్చు: గవాస్కర్

IPL and T20 World Cup in India in 2020: Sunil Gavaskar suggests swap

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గితే సెప్టెంబర్​లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) జరిగే అవకాశం అధికంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. అలాగే అక్టోబర్ నుంచి జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణను ఆస్ట్రేలియా నుంచి భారత్​కు మార్చవచ్చని సూచించారు. వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే పలు క్రికెట్ టోర్నమెంట్‌లు రద్దైన విషయం తెలిసిందే. ఇందులో ఐపీఎల్-13 కూడా ఉంది.

ప్రపంచకప్ నిర్వహణపై నీలినీడలు

ప్రపంచకప్ నిర్వహణపై నీలినీడలు

భారత కేంద్ర కేంద్రం మే 3వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఐపీఎల్‌-13ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆరు నెలల పాటు తమ సరిహద్దులను మూసివేసింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం ఐసీసీకి సమస్యగా మారింది.

ఆస్ట్రేలియాలో కష్టం

ఆస్ట్రేలియాలో కష్టం

త్వరలో కరోనా వ్యాప్తి సమస్యలు తీరితే.. ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్ కూడా భారత్‌లోనే నిర్వహించవచ్చని సునీల్ గవాస్కర్ అన్నారు. సన్నీ ఓ టీవీ చానెల్​తో మంగళవారం మాట్లాడుతూ... 'సెప్టెంబర్ 30వరకు వేరే దేశాల నుంచి ఎవరూ రాకుండా ఆస్ట్రేలియా నిషేధం విధించింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మూడో వారం నుంచి టీ20 ప్రపంచకప్ జరగాల్సింది. అయితే ప్రస్తుతం ఉన్న ఆంక్షల వల్ల అది చాలా కష్టం' అని అన్నారు.

ఒప్పందం చేసుకోవాలి

ఒప్పందం చేసుకోవాలి

'ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు భారత్​, ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకోవాలి. ఒకవేళ భారత్​లో కరోనా ప్రభావం తగ్గితే.. ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​లో టీ20 ప్రపంచకప్ ఇక్కడ నిర్వహించాలి. వచ్చే ఏడాది భారత్​లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీని ఆస్ట్రేలియాకు బదిలీ చేయాలి. అలా అయితే ఈ ఏడాది విశ్వకప్ జరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఈ టోర్నీకి కొన్ని వారాల ముందు ఐపీఎల్‌ పెడితే.. అది ప్రపంచకప్‌కి ప్రాక్టీస్‌లా ఉంటుంది' అని సన్నీ సూచించారు.

గవాస్కర్‌ భారీ విరాళం

గవాస్కర్‌ భారీ విరాళం

సునీల్ గవాస్కర్‌ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మహమ్మారి కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా రూ.59 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దీనిలో రూ.35 లక్షలు పీఎం కేర్స్‌కు, రూ.24 లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాడు. అయితే ఈ విష‌యాన్ని లిటిల్ మాస్ట‌ర్ నేరుగా ప్ర‌క‌టించ‌లేదు. ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మ‌జుందార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్రువీక‌రించారు. 1971 నుంచి 1987 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గావస్కర్‌ మొత్తం 35 సెంచరీలు చేశారు. ఇందులో 34 సెంచరీలు టెస్టు ఫార్మాట్‌లో, ఒక సెంచరీ వన్డే ఫార్మాట్‌లో చేశారు.

Story first published: Tuesday, April 21, 2020, 17:24 [IST]
Other articles published on Apr 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+