CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2025లో 14 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మంగళవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సీజన్-18లో తమ చివరి లీగ్ మ్యాచ్ అడింది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ తమ ఐపీఎల్ 2025 ప్రయాణాన్ని విజయంతోముగించింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన పేరిట ఒక ప్రత్యేకమైన రికార్డును సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప బ్యాటర్లు కూడా చేయలేని ఘనతను యశస్వి జైస్వాల్ సాధించాడు.
రికార్డు సాధించిన యశస్వి జైస్వాల్
ఐపీఎల్ 2025 యశస్వి జైస్వాల్కు చాలా అద్భుతంగా గడిచింది. యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 14 మ్యాచ్ల్లో 559 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇది కాకుండా జైస్వాల్ 5 సార్లు బౌండరీతో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలో 2 వేర్వేరు సీజన్లలో 5 ఇన్నింగ్స్లలో బౌండరీతో శుభారంభం చేసి తొలి బ్యాటర్గా నిలిచాడు. అంతకుముందు జైస్వాల్ ఐపీఎల్ 2023లో ఈ ఘనత సాధించాడు.

యశస్వి జైస్వాల్ కంటే ముందు విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ నాలుగు ఇన్నింగ్స్లను బౌండరీతో ప్రారంభించారు. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్లో ఆర్సీబీపై యశస్వి జైస్వాల్ సిక్స్తో ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. దీని తర్వాత పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లపై ఫోర్ కొట్టడం ద్వారా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. సీఎస్కేతో జరిగిన సీజన్ చివరి మ్యాచ్లో యశస్వి బౌండరీ కొట్టడం ద్వారా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు.
6 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్
సీజన్-18లో తమ చివరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 53 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.