IPL 2025: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ మ్యాచ్ ఆడినప్పుడల్లా విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా మ్యాచ్ చూడటానికి స్టేడియానికి చేరుకుంది. గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి అనుష్క శర్మ కూడా ముల్లన్పూర్ స్డేడియానికి చేరుకున్నారు. కానీ సోషల్ మీడియాలో అనుష్క శర్మతో కలిసి కూర్చుని మ్యాచ్ను వీక్షించిన మహిళ గురించి నెటిజన్లు తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు ఆమె ఎవరు.. ఆర్సీబీతో ఉన్న సంబంధం ఏమిటని సెర్చ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న అనుష్క స్నేహితురాలు
ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మతో కూర్చున్న మహిళ గురించి సోషల్ మీడియాలో అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. నిజానికి ఈ మహిళ అనుష్క శర్మ స్నేహితురాలు మాళవిక నాయక్. మాళవిక నాయక్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఎంబీఏను పూర్తి చేసింది. ఇప్పుడు ఆమె ఇన్నోస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వ్యాపార అభివృద్ధి, భాగస్వామ్య పనులను చూసుకుంటోంది. అనుష్క శర్మ కూడా ఆమెను ఇన్స్టాలో అనుసరిస్తోంది. గతంలో కూడా లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సమయంలో కూడా మాళవిక అనుష్కతో కలిసి కనిపించింది.

ఆర్సీబీతో ఉన్న ప్రత్యేక సంబంధం ఏమిటి?
మాళవిక నాయక్కు ఆర్సీబీతో ప్రత్యేక సంబంధం ఉంది. నిజానికి మాళవిక నాయక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెవెన్యూ, మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే భార్య. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, మాళవిక నాయక్, నిఖిల్ సోసాలే చాలా సందర్భాలలో కలిసి కనిపించారు.
ఫైనల్కు చేరిన ఆర్సీబీ
ఐపీఎల్ క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ జట్టును ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఓడించి 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ ప్రమాదకరమైన బౌలింగ్తో పంజాబ్ జట్టును ముచ్చెటమలు పట్టింది. దీని కారణంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్సీబీ కేవలం 10 ఓవర్లలోనే మ్యాచ్ను గెలిచింది.