SRH Match Tickets Release : ఐపీఎల్ - 2025 సీజన్ మరో 16 రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగేలా.. అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది. సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు అదిరే సర్ ప్రైజ్ ఇచ్చింది.
Orange Army, it’s time! 🧡
— SunRisers Hyderabad (@SunRisers) March 6, 2025
Tickets for our first two home games go live 𝐓𝐎𝐌𝐎𝐑𝐑𝐎𝐖 at 11 AM on @lifeindistrict
Buy 2 tickets and get 1 jersey FREE!#PlayWithFire pic.twitter.com/0LsUCatBoo
హైదరాబాద్ లో జరిగే తొలి రెండు మ్యాచులకు సంబంధించిన టికెట్లను అందుబాటులో తీసుకురానున్నట్లు తెలిపింది. మార్చి 7 నుంచి టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఉదయం 11 గంటల నుంచి అమ్మకాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. 23న సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, 27న సన్ రైజర్స్ వర్సెస్ లఖ్ నవూ సూపర్ జెయింట్స్ మ్యాచులు జరగనున్నాయి. ఈ మ్యాచులకు సంబంధించిన టికెట్లనే మార్చి 7న విక్రయించనున్నారు. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీగా ఫ్రీగా ఇవ్వనున్నట్లు కూడా సన్ రైజర్స్ తెలిపింది.

కొనుగోలు చేసిన ఆటగాళ్లు: ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు), మహ్మద్ షమి (రూ.10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.3.20 కోట్లు), ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు), సిమర్జీత్ సింగ్ (రూ.1.50 కోట్లు), ఎషన్ మలింగ (రూ.1.20 కోట్లు), బ్రైడన్ కార్సే (రూ.కోటి), జయ్దేవ్ ఉనద్కత్ (రూ.కోటి), కమిందు మెండిస్ (రూ.75 లక్షలు), జిషాన్ అన్సారీ (రూ.40 లక్షలు), సచిన్ బేబి(రూ.30లక్షలు), అంకిత్ వర్మ (రూ.30 లక్షలు), అథర్వ తైడే (రూ.30 లక్షలు).
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: క్లాసెన్(రూ.23కోట్లు), కమిన్స్(రూ.18కోట్లు), అభిషేక్ (రూ.14కోట్లు), హెడ్(రూ.14కోట్లు), నితీశ్ కుమార్(రూ.6కోట్లు)