IPL 2025: ఐపీఎల్ 2025లో అద్భుతంగా పరుగులు సాధిస్తూ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్లో 5000 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. 5 వేల టీ20 పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన భారత ఆటగాళ్ల జాబితాలో శుభ్మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ టైటాన్స్ వికెట్ కోల్పోకుండానే దానిని చేరుకుంది.

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేరుకున్నారు. గుజరాత్ టైటాన్స్ కేవలం 19 ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని చేరుకుంది. సాయి సుదర్శన్ 61 బంతుల్లో 108 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 93 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ టీ20 మ్యాచ్లలో 5 వేల పరుగుల మైలురాయిని దాటాడు.
శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ గత రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ 167 ఇన్నింగ్స్లలో 5000 టీ20 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ ఇప్పుడు 154 ఇన్నింగ్స్లలో 5000 టీ20 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన భారత ఆటగాడు కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ 143 ఇన్నింగ్స్లలోనే ఈ మైలురాయిని సాధించి మొదటి స్థానంలో నిలిచాడు.