For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు దక్షిణ భారతంలోనే.. బీసీసీఐ కీలక నిర్ణయం!

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్‌లో మిగిలిన 16 మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్, పాక్ ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్ 2025 ఒక వారం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌ల కోసం సన్నాహాలు ప్రారంభించబడ్డాయి. మిగిలిన మ్యాచ్‌లన్నీ దక్షిణ భారతదేశంలోనే జరుగుతాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లను వేదికలుగా బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ప్రభుత్వంతో మాట్లాడి టోర్నమెంట్‌ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా బీసీసీఐ ఐపీఎల్‌ను వారం పాటు వాయిదా వేసింది. అయితే మే నెలలోనే ఐపీఎల్ తిరిగి ప్రారంభమవుతుందా లేదా అనే దానిపై బీసీసీఐ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో కూడా స్పష్టత లేదు. 3 దక్షిణ భారత నగరాలను సిద్దంగా ఉంచాలని బీసీసీఐ నిర్ణయించింది. కానీ ప్రస్తుత వాతావరణంలో ఐపీఎల్‌ను ముందుగా ప్రారంభించడం కష్టమని బీసీసీఐ అధికారులు అంటున్నారు.

IPL 2025 Remaining Matches Likely in South India BCCI s Backup Plan Revealed

ఓ నివేదిక ప్రకారం.. జట్లకు కూడా ఈ సమాచారం అందించబడింది. మిగిలిన మ్యాచ్‌లను మే నెలలో తిరిగి ప్రారంభించాలంటే అతిపెద్ద సమస్యల్లో ఒకటి విదేశీ ఆటగాళ్లను తిరిగి తీసుకురావడం. ఐపీఎల్ ఆగిపోయిన వెంటనే జట్లు చెల్లాచెదురుగా వెళ్లిపోయాయి. ఆటగాళ్లు తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. కానీ మే నెలలో ఐపీఎల్ తిరిగి ప్రారంభమైతే చాలా మంది విదేశీ ఆటగాళ్లు తిరిగి వస్తారని జట్లు ఆశాభావంతో ఉన్నాయి. కానీ ఈ టోర్నమెంట్ మే 25 తర్వాత అంటే జరగడం కష్టమే అని చెప్పవచ్చు. ఐపీఎల్ ఫైనల్ మే 25న కోల్‌కతాలో జరగాల్సి ఉంది. దీన తర్వాత చాలా మంది ఆటగాళ్లు ఇతర దేశాలకు ఆడవలసి ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) ఫైనల్ కూడా జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరగనుంది.

ఐపీఎల్ 2025లో మొత్తం 57 మ్యాచ్‌లు జరిగాయి. మే 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, డిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 58వ మ్యాచ్ జరుగుతోంది. కానీ 10.1 ఓవర్ల తర్వాత దాన్ని నిలిపివేశారు. ఆ మ్యాచ్‌ను తిరిగి నిర్వహించాలా వద్దా అని ఐపీఎల్ ఇంకా నిర్ణయించలేదు. ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

ముందుగా మొదటి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌‌లు హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. రెండో క్వాలిఫయర్, పైనల్ మ్యాచ్‌లు కోల్‌కతాలో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు బీసీసీఐ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. విదేశీ ఆటగాళ్లను తిరిగి తీసుకురావడం చాలా కష్టం. చాలా మంది ఆటగాళ్లకు ఇతర దేశాలతో మ్యాచ్‌లు ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఉంది. ఈ పరిస్థితిలో ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ ఆడతాయో చూడాలి.

Story first published: Saturday, May 10, 2025, 17:09 [IST]
Other articles published on May 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+