IPL 2025: భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2025ను నిరవధికంగా వాయిదా వేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నిర్ణయించింది. అభిమానులు, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించే అవకాశం ఉంది. గురువారం (మే 8) ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేయబడిన సంగతి తెలిసిందే. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లోని అనేక ప్రాంతాలు పాకిస్థాన్ నుంచి దాడికి గురవుతున్నందున రద్దు చేయబడింది.

ఐపీఎల్ 2025 సీజన్ నిలిపివేయబడిందని బీసీసీఐ పేర్కొంది. పరిస్థితిని సమీక్షించడంతో పాటు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 మొత్తం సీజన్ నిలిపివేయబడిందా లేదా తరువాత తేదీకి మార్చబడుతుందా అనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భారత్, పాక్ దేశాల మధ్య పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మొత్తం లీగ్ రద్దు అయ్యే ప్రమాదం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు గురువారం రాత్రి మైఖేల్కు తెలియజేశారు.