ఐపీఎల్ 2025 కోసం ధోనీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడని తెలిసింది. గత సీజన్ లో మోకాలి నొప్పితో సర్జరీ చేయించుకున్న అతడు ప్రస్తుతం ఈ సీజన్ కోసం ఫుల్ ఫిట్ గా తయారయ్యాడట. త్వరలోనే అతడు సీఎస్కే ప్రీ సీజన్ క్యాంప్ లో జాయిన్ అవ్వబోతున్నాడని సమాచారం అందింది. ఈ విషయాన్ని ధోనీకి బాగా దగ్గరైన ఓ వ్యక్తి తెలిపారు.
ఆటగాడిగా కన్నా ఎక్కువగా..
ఐపీఎల్ 2025లో మహేంద్రసింగ్ ధోనీ ఆడనున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రూ.4 కోట్లకు దక్కించుకుంది. అతడు కెప్టెన్ గా వ్యవహరించకపోయినప్పటికీ జట్టులో అతడి క్రేజే ఏ మాత్రం తగ్గలేదు. ఈ సీజన్ లో మహీ.. సీఎస్కే జట్టుకు ఓ ఆటగాడిగా కన్నా ఎక్కువని ధోనీకి సంబంధించిన ప్రతినిధి పేర్కొన్నారు. "ధోనీ ఫిబ్రవరి 25న చెన్నైకి వచ్చి జట్టుతో కలవనున్నారు. ఆయన చాలా కాలం నుంచి ఫారెన్ లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన సీఎస్కేతో కలవనున్నారు." అని సదరు ప్రతినిధి తెలిపాడు.

తొలి మ్యాచ్ ఎవరితో అంటే?
మార్చి 22నుంచి తెరలేవనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్లో.. చెన్నై సూపర్ కింగ్స్ తన ఓపెనింగ్ మ్యాచ్ ను ముంబయి ఇండియన్స్ తో మార్చి 23న ఆడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.