Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: లక్నో చెత్త రికార్డు.. అలా చేసిన తొలి జట్టుగా!

IPL 2025: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆర్సీబీ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 227 పరుగులు చేసినప్పటికీ రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో జట్టు ఈ దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో లక్నో జట్టు బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఐపీఎల్‌‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేరు మీద చెత్త రికార్డు నమోదైంది.

లక్నో చెత్త రికార్డు
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 118 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు ఈ భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఆర్సీబీ 18.4 ఓవర్లలోనే ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆర్సీబీ క్వాలిఫయర్-1కి చేరుకుంది. అదే సమయంలో ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మూడు సార్లు 200 కంటే ఎక్కువ స్కోరు చేసింది. ఆ మూడు సార్లు కూడా లక్నో జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు 200 కంటే ఎక్కువ స్కోరు చేసిన తర్వాత కూడా ఓడిపోయిన మొదటి జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది.

IPL 2025 LSG Sets Unwanted Record First Team to Lose 3 Matches Despite 200 Totals

ఈ సీజన్ లో ముందుగా మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై లక్నో 209 పరుగులు చేసింది. కానీ లక్నో జట్టు ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. దీని తర్వాత రెండోసారి లక్నో సూపర్ జెయింట్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 205 పరుగులు చేసింది. అప్పుడు కూడా రిషబ్ పంత్ జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే తాజాగా ఆర్సీబీపై 227 పరుగులు చేసిన తర్వాత కూడా లక్నో జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

సెంచరీ కొట్టిన రిషబ్ పంత్
ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ రిషబ్ పంత్ తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీని సాధించాడు. ఐపీఎల్‌లో ఈ అద్భుతమైన సెంచరీని రిషబ్ పంత్ ఏడేళ్ల తర్వాత చేశాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నప్పుడు రిషబ్ పంత్ సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై సెంచరీ చేశాడు. ఆర్సీబీపై 61 బంతుల్లో 118 పరుగులు చేసి రిషబ్ పంత్ అజేయంగా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు రిషబ్ పంత్ బ్యాట్ నుంచి వచ్చాయి.

Story first published: Wednesday, May 28, 2025, 14:35 [IST]
Other articles published on May 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+