IPL 2025:ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఘోరంగా విఫలమైంది. ఆ జట్టు ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్లు ఆడింది. వాటిలో కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఆ జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం ఆ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లు విఫలం కావడమే. ముఖ్యంగా మెగా వేలానికి ముందు కేకేఆర్ నిలుపుకున్న ఆటగాళ్లే వైఫల్యానికి కారణం కావడం విస్మయానికి గురిచేస్తాంది. కేకేఆర్ రిటెన్షన్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది.
ఆరుగురు ఆటగాళ్లను నిలుపుకున్న జట్లలో కేకేఆర్ ఒకటి. ఇందులో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, హర్షిత్ రాణా, రమణ్ దీప్ సింగ్ పేర్లు ఉన్నాయి. ఈ ఐదుగురు ఆటగాళ్ల కోసం కేకేఆర్ రూ.69 కోట్లు ఖర్చు చేసింది. కానీ వారి ప్రదర్శన ఆశించినంతగా లేదు. ముఖ్యంగా రింకూ సింగ్, రస్సెల్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

కేకేఆర్ రిటైన్ ఆటగాళ్ల వల్ల ఉపయోగం లేదు..
ఐపీఎల్ 2025లో కేకేఆర్ జట్టుకు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో ఉపయోగం లేకుండా పోయింది. కేకేఆర్ జట్టు రింకూ సింగ్కు అత్యధికంగా రూ.13 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. కానీ ఈ సీజన్లో రింకూ సింగ్ ఆటతీరును పరిశీలిస్తే అది అంచనాలకు తగ్గట్లుగా లేదు. ఈ సీజన్లో కేకేఆర్ తరఫున రింకూ సింగ్ 9 మ్యాచ్ల్లో 133 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కేకేఆర్ తరఫున రిటెన్షన్లో సునీల్ నరైన్ రెండో అతిపెద్ద ఆటగాడు. సునీల్ నరైన్కు కేకేఆర్ రూ.12 కోట్లు ఖర్చు చేసింది. ఈ సీజన్లో నరైన్ కూడా తన జట్టుకు ప్రభావవంతంగా కనిపించలేదు. ఈ సీజన్లో నరైన్ ప్రదర్శనను పరిశీలిస్తే, బ్యాటింగ్లో 151 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
వరుణ్ చక్రవర్తి కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ కు కేకేఆర్ రిటెన్షన్ కింద రూ.12 కోట్లు కూడా ఇచ్చింది. ఈ సీజన్ తొలి కొన్ని మ్యాచ్ లు తప్ప వరుణ్ కూడా ఘోరంగా విఫలమయ్యాడు. ఇది కాకుండా ఈ సీజన్ లో ఆండ్రీ రస్సెల్ కూడా అంతగా రాణించడం లేదు. ఆండ్రీ రస్సెల్ కూడా రూ.12 కోట్లు తీసుకున్నాడు. . హర్షిత్ రాణా, రమణ్దీప్ సింగ్లను కేకేఆర్ చెరో 4 కోట్ల రూపాయలకు నిలుపుకుంది, కానీ వారిద్దరూ పెద్దగా గుర్తింపు పొందలేకపోయారు.