IPL 2025 Final: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు తన మొదటి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో ఆ జట్టు అభిమానులు ప్రతి చోటా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆర్సీబీ అభిమానులు ఆ జట్టు ఛాంపియన్గా నిలిచేందుకు 17 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. అది ఇప్పుడు నెరవేరింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ అద్భుతంగా రాణించి 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఛాంపియన్ అయిన తర్వాత జట్టు మాజీ యజమాని, పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కూడా స్పందించాడు.
ఆర్సీబీ గెలుపుపై విజయ్ మాల్యా స్పందన ఇదే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంతకు ముందు 3 సార్లు ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. కానీ ప్రతిసారీ ఆర్సీబీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సారి ఆర్సీబీ సీజన్ అంతటా దూకుడు శైలిలోనే కనిపించింది. బౌలింగ్ నుంచి బ్యాటింగ్ వరకు అద్భుతంగా రాణించడంతో ఇప్పుడు ఈ జట్టు ఛాంపియన్గా మారింది. అదే సమయంలో ఆర్సీబీ మొదటిసారి ఛాంపియన్గా నిలిచినప్పుడు విజయ్ మాల్యా ట్వీట్ చేసాడు. "నేను ఆర్సీబీ జట్టును ప్రారంభించినప్పుడు ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరు గెలవాలనేది నా కల. యువ ఆటగాడిగా లెజెండరీ కింగి కోహ్లీని ఎంచుకునే అవకాశం నాకు లభించింది. కోహ్లీ 18 ఏళ్లుగా ఆర్సీబీతో ఉండటం గమనార్హం. ఆర్సీబీ చరిత్రలో చెరగని భాగమైన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్లను ఎంపిక చేసే గౌరవం కూడా నాకు లభించింది. చివరకు ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుకు చేరుకుంది. నా కలను నిజం చేసిన వారందరికీ అభినందనలు. ఆర్సీబీ అభిమానులు అందరూ ఐపీఎల్ ట్రోఫీకి అర్హులు. ఈ సాలా కప్ బెంగళూరుదే." అంటూ విజయ్ మాల్యా ట్వీట్లో పేర్కొన్నారు.

విజయం తర్వాత డివిలియర్స్ను కౌగిలించుకున్న విరాట్ కోహ్లీ
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీకి మద్దతు ఇవ్వడానికి మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా చేరుకున్నాడు. డివిలియర్స్ చాలా కాలంగా ఆర్సీబీలో భాగంగా ఉన్నాడు. అదే సమయంలో మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఏబీ డివిలియర్స్ను కౌగిలించుకున్నాడు. వారి చిత్రాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. దీనితో పాటు డివిలియర్స్, విరాట్ కోహ్లీ, ఇతరులు ఆర్సీబీ జెర్సీ ధరించి ట్రోఫీని కూడా ఎత్తారు.