ఐపీఎల్ 2025కు మరో 10 రోజులే సమయం మిగిలి ఉంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టీ20 లీగ్ కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సాహంలో ఉన్న టీమిండియా ప్లేయర్లు.. నెక్ట్స్ ఐపీఎల్ 2025 కోసం సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనాల్సిన అన్నీ జట్లు ట్రైనింగ్ క్యాంప్ లు నిర్వహించి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. అయితే తాజాగా ధోనీ మాత్రం సడెన్ గా ట్రైనింగ్ క్యాంప్ ను మధ్యలో నుంచి వీడడం ఫ్యాన్స్ లో పలు అనుమానాలను లేవనెత్తింది. పైగా అతడి భార్యతో కలిసి వెళ్లిపోయాడు.
దీంతో ధోనీ ఎందుకు మధ్యలో నుంచి వెళ్లిపోయాడా అని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆరా తీస్తున్నారు. అతడికి ఏమైనా అయిందా లేదా ఇంకేమైనా జరిగిందా అని కాస్త టెన్షన్ పడుతున్నారు. మరి కొంతమంది అతడికి గాయమైందా అని అనుమానిస్తున్నారు. కానీ ఇదంతా ఊహాగానాలు మాత్రం. వాస్తవానికి మహీకి ఏం కాలేదు. ధోనీ తన భార్యతో కలిసి సీఎస్కే ట్రైనింగ్ క్యాంప్ వీడటానికి ఓ శుభవార్త కారణం.
