IPL 2025: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో పరుగులు చేసినా చేయకపోయినా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. శనివారం చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నైసూపర్ కింగ్స్ 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ధోని విజయం సాధిస్తాడని జట్టుతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆశించారు. ధోని అలా చేయలేకపోయాడు. 26 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్గా తిరిగి వచ్చాడు.
భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఎంఎస్ ధోని ఆటతీరు, సీఎస్కే ఓటమిని మరోసారి లక్ష్యంగా చేసుకున్నాడు. సీఎస్కేకు నాయకత్వం వహిస్తూనే ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచిన అనంతరమే ధోని రిటైర్ అయి ఉండాల్సిందని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో జట్టును గెలిపించలేకపోవడం వల్ల ధోని గౌరవం కోల్పోతున్నాడని అతని అభిప్రాయం.

ధోని బ్యాటింగ్పై తలెత్తుతున్న ప్రశ్నలు
ఎంఎస్ ధోని చాలా సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్ లైనప్లో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఎంఎస్ ధోని మ్యాజిక్ కనిపించడం లేదు. ఈ సీజన్లో సీఎస్కే జట్టు ఇబ్బంది పడటానికి ఇదే కారణం. ధోని ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ ల్లో 76 పరుగులు చేశాడు. కానీ అభిమానులు, నిపుణులు ధోని బ్యాటింగ్పై ప్రశ్నలు లేవనెత్తారు.
ధోని రిటైర్మెంట్ తీసుకోవడానికి 2023 సరైన సమయం-మనోజ్ తివారీ
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కేకు 9.2 ఓవర్లలో 110 పరుగులు అవసరమైనప్పుడు ధోని తనకు ఇష్టమైన బ్యాటింగ్ స్థానం 7లో బ్యాటింగ్కు వచ్చాడు. క్రిక్బజ్లో ఎంఎస్ ధోని గురించి మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ధోని రిటైర్ కావడానికి సరైన సమయం 2023 అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆ సంవత్సరం ధోని ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడని.. అప్పుడే రిటైర్ అయి ఉండాల్సిందన్నారు. గత రెండేళ్లుగా ధోని ఆడుతున్న విధానం కారణంగా క్రికెట్లో ధోని సంపాదించిన పేరు, కీర్తి, గౌరవం కోల్పోతున్నట్లు తాను భావిస్తున్నానని అన్నాడు. ధోని 10 ఓవర్లకు మించి బ్యాటింగ్ చేయలేడని చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యను కూడా ఈ మాజీ ఆటగాడు ప్రశ్నించాడు. ఈ నిర్ణయాలు ఫ్రాంచైజీ ప్రయోజనాలు కోసం తీసుకోవడం లేదని మనోజ్ తివారీ అన్నాడు.