ఐపీఎల్ 2025 సమయం దగ్గర పడుతుండడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠత పెరుగుతోంది. ఎప్పుడెప్పుడు ఈ మెగా లీగ్ ప్రారంభం అవుతుందా అని వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలానే మ్యాచ్ టికెట్ల కోసం కాపు కాసి మరీ ఎదురుచూస్తున్నారు. దీంతో బ్లాక్ టికెట్స్ దందా కూడా మొదలైపోయింది. ఒక్కో టికెట్ ధర లక్షల్లో పలుకుతోంది. అభిమానులు కూడా అంత ధర పెట్టి కొనుగోలు చేసేందుకు వెనకాడటం లేదు.
ఆ జట్టు మ్యాచులకు ఫుల్ డిమాండ్..
ఐపీఎల్లో ముంబయి, సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్లకు ఎంతటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాచ్ కోసం ఎంతైనా చెల్లించి స్టేడియానికి తరలి వెళ్తుంటారు అభిమానులు. ఇదే అదనుగా చేసుకుని ఈ సారి ఐపీఎల్ లో బ్లాక్ మార్కెట్ మరింత చెలరేగిపోతోంది. మొత్తంగా 12 కేటగిరీలుగా విభజించి టికెట్లను విక్రయిస్తున్నారు. లోయర్ స్టాండ్ టికెట్లను ఒరిజినల్ ధర కన్నా పది రెట్లు ఎక్కువతో అమ్ముతున్నారు.
