ఐదుసార్లు ఛాంపియన్, మూడు సార్లు తప్ప ప్రతీసారీ ఫేఆప్స్, జట్టులో ధోని లాంటి మేటి ప్లేయర్.. ఇది చాలు చెప్పడానికి ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలాంటిదో. ఐపీఎల్లో అత్యంత నిలకడైన జట్టుగా రాణిస్తోన్నసీఎస్కే. ఏకంగా పది సార్లు ఫైనల్ చేరి ఐదు టైటిళ్లు సాధించింది. ఇప్పుడు మరోసారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
కానీ గతేడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ కు కూడా చేరకుండా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. అనుకున్నట్టే ఈసారి విజేతగా నిలిస్తే చెన్నై జట్టు.. ముంబయి ఇండియన్స్ను అధిగమించి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీగా నిలుస్తుంది.
చెన్నై బలాలు..
టీమ్ కాంబినేషన్
గైక్వాడ్, కాన్వే ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. మిడిలార్డర్ లో రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి,జడేజా .. ధోనీ వికెట్ కీపర్ గా లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగుతాడు. స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్లుగా రచిన్, జడేజా ఆడనుండగా.. వీరిద్దరికి తోడుగా స్పిన్ ను అప్ఘాన్ నూర్ అహ్మద్ పంచుకుంటాడు. ఖలీల్ అహ్మద్, మతీషా పlతిరణ పేస్ విభాగాన్ని పంచుకుంటారు.
ఫైనల్ గా పేపర్ పై సీఎస్కే బ్యాటింగ్ బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. మంచి సాలిడ్ గా, బ్యాలెన్స్డ్ గా ఉంది. తన తొలి మ్యాచ్ ను మార్చి 23న ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది. చూడాలి మరి బరిలోకి దిగినప్పుడు ఈ జట్టుతో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో.
