IPL 2025: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆ జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. శనివారం రాజస్థాన్ రాయల్స్ వారి సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అదే విధంగా రాజస్థాన్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్ల్లో 6 ఓటములను ఎదుర్కొంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్కు చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అయితే రాజస్థాన్కు ప్లేఆఫ్కు తలుపులు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు.
ప్లేఆఫ్స్ చేరుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ సమీకరణాలు ఇలా..
ఐపీఎల్ సీజన్-18లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఆ జట్టు 6 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూడగా.. 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 పాయింట్లు, -0.633 నికర రన్ రేట్తో ఎనిమిదో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఇక్కడి నుంచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే మిగిలిన అన్ని మ్యాచ్లను గెలవాలి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. జట్టు అన్ని మ్యాచ్లను గెలవాలి. దీనితో పాటు జట్టు నికర రన్ రేట్ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రాజస్థాన్ తన అన్ని మ్యాచ్లను భారీ తేడాతో గెలవాలి.

చివరి ఓవర్లో రెండు సార్లు 9 పరుగులు చేయలేకపోయింది..
లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో సీజన్-18లో మొదటి సూపర్ ఓవర్ కనిపించింది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్లో కూడా రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్ లో గెలవడానికి 9 పరుగులు అవసరం, కానీ మిచెల్ స్టార్క్ అలా జరగనివ్వలేదు. అనంతరం సూపర్ ఓవర్ జరిగిందియ అప్పుడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చివరి ఓవర్లో 9 పరుగులు చేసి ఉంటే సూపర్ ఓవర్ అవసరం ఉండేది కాదు.
ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ గెలవాలంటే రాజస్థాన్కు చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కానీ అవేష్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ ముందు బ్యాటర్లు కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీని కారణంగా జట్టు ఆరో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.