గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సాయి సుదర్శన్ (45; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), డేవిడ్ మిల్లర్ (44*; 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఛేదనలో సత్తాచాటారు.
బ్యాటింగ్కు అంతగా అనుకూలించిన ఈ స్లో పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 162 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (29; 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. మోహిత్ శర్మ (3/25) మూడు వికెట్లతో మెరిశాడు. అనంతరం ఛేదనకు దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

గుజరాత్ ఛేదనను వృద్ధిమాన్ సాహా (25; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆరంభించాడు. కానీ సాహా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో కమిన్స్ చేతికి చిక్కాడు. అనంతరం సాయి సుదర్శన్తో కలిసి మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (36; 28 బంతుల్లో) నిలకడగా ఆడటంతో గుజరాత్ పవర్ప్లేలో 52 పరుగులు చేసింది.
ఆ తర్వాత SRH బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గుజరాత్ను 12 ఓవర్లకు 90/2 స్కోరుకు కట్టడి చేశారు.కానీ బ్రేక్ అనంతరం సాయి సుదర్శన్ గేర్ మార్చాడు. అతడికి తోడుగా డేవిడ్ మిల్లర్ కూడా చెలరేగడంతో లక్ష్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. చివరి 5 ఓవర్లకు 49 పరుగులు అవసరమవ్వా.. మార్కండే వేసిన 16వ ఓవర్లో మిల్లర్ రెండు ఫోర్లు, సాయి సుదర్శన్ ఓ సిక్సర్ బాది 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వైపు మళ్లింది. సుదర్శన్ ఔటైనప్పటికీ విజయ్ శంకర్ (14*; 11 బంతుల్లో)తో కలిసి మిల్లర్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్కు శుభారంభం లభించలేదు. మయాంక్ అగర్వాల్ (16; 17 బంతుల్లో, 2 ఫోర్లు) మరోసారి నిరాశపరిచాడు. అజ్మతుల్లా బౌలింగ్లో దర్మన్ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (19; 14 బంతుల్లో, 3 ఫోర్లు) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కానీ అభిషేక్ శర్మ (29; 20 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో సన్రైజర్స్ పవర్ప్లేలో 56 పరుగులు చేసింది.
రషీద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో అభిషేక్ వరుసగా రెండు సిక్సర్లు సాధించాడు. కానీ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లు పుంజుకున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. అభిషేక్, హెన్రిచ్ క్లాసెన్ (24; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (17; 19 బంతుల్లో) వరుసగా పెవిలియన్కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన అబ్దుల్ సమద్తో షాబాజ్ అహ్మద్ (22; 20 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. వారిద్దరు బ్యాటు ఝుళిపించి సన్రైజర్స్కు పోరాడే స్కోరు అందించాడు.