
వరుస ఓటములకు చాలా కారణాలు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటములకు చాలా కారణాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు జట్టును వేధిస్తోన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలడం అభిమానులకు మింగుడు పడనివ్వట్లేదు. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది ఆర్సీబీ.
కనీసం ఆ లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 115 పరుగులకే కుప్పకూలిందంటే బ్యాటింగ్ ఆర్డర్ ఎంత అస్తవ్యస్తంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.

రెండు మ్యాచ్లల్లో ఘోర వైఫల్యం..
అంతకుముందు మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ చేసిన స్కోర్ 68 పరుగులు మాత్రమే. పూర్తి 20 ఓవర్లను కూడా ఆడలేక చేతులెత్తేసింది. 16.1 ఓవర్లకు చాప చుట్టేసింది. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోలేక 115 పరుగులకే ఆలౌట్ అయింది.
జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి ఈ రెండు మ్యాచ్లు అద్దం పట్టాయి. ప్రమాద ఘంటికలను మోగించాయి. మేల్కొనకపోతే ముప్పు తప్పదనే సంకేతాలను పంపించాయి.

ప్లేఆఫ్స్ కష్టమే..
చెత్తగా ఓడిన ఈ రెండు మ్యాచ్ల అనంతరం రాయల్ ఛాలెంజర్స్ ఇక పుంజుకోకపోవచ్చని, తనను తాను మళ్లీ మార్చుకోవాల్సిన అవసరం ఉందని వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్, కామెంటేటర్ ఇయాన్ బిషప్ స్పష్టం చేశాడు. ఇలాంటి నాసిరకం ఆటతీరుతో ఈ టోర్నమెంట్లో చివరి వరకూ కొనసాగడం కష్టమని, ఇలాగే ఆడితే- రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్స్కు చేరబోదనీ జోస్యం చెప్పాడు. మళ్లీ పుంజుకోవాలంటే కఠోరంగా శ్రమించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు.

145 పరుగులను ఛేదించలేకపోతే ఎలా..
రాజస్థాన్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోవడం తనను ఆందోళన కలిగిస్తోందని ఇయాన్ బిషప్ చెప్పాడు. మిడిలార్డర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ విఫలమైతే ఇన్నింగ్ను నిలబెట్టేలా బ్యాటర్లు లేరా? అని ప్రశ్నించాడు.
విరాట్ కోహ్లీ మళ్లీ గాడిన పడాల్సిన అవసరం ఉందని, అతను పరుగులు చేస్తేనే జట్టు నిలబడగలుగుతుందని తేల్చిచెప్పాడు. క్రీజ్లో విరాట్ కోహ్లీ ఎదుర్కొనే ఒత్తిడిని తామూ తీసుకోవాల్సిన బాధ్యతను ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్వెల్ తీసుకోవాలని సూచించాడు.


Click it and Unblock the Notifications












