న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తండ్రయిన హెట్మెయిర్: పసిబిడ్డతో ఆడుకుంటూ మురిసిపోతున్న పించ్ హిట్టర్

IPL 2022: Rajasthan Royals batter Shimron Hetmyer has become a father

ముంబై: వెస్టిండీస్ క్రికెటర్ షిమ్రోన్ హెట్మెయిర్ తండ్రయ్యాడు. అతని భార్య నిర్వాణి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారంటూ హెట్మెయిర్ తెలిపాడు. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్న ఈ వీడియో క్లిప్పింగ్.. క్షణాల్లో వైరల్‌గా మారింది. వేలాదిమంది అభిమానులు హెట్మెయిర్‌ను విషెస్ తెలిపారు. అతణ్ని అభినందిస్తూ రిప్లైలు పెట్టారు.

షిమ్రోన్ హెట్మెయిర్.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నమెంట్‌లో పాల్గొంటోన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆతను ఆడుతున్నాడు. 7.75 కోట్ల రూపాయలకు అతణ్ని జట్టులోకి తీసుకుంది రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ. తనపై ఉన్న అంచనాలకు అనుగుణంగా ఆడుతున్నాడు. జట్టు భారీ స్కోర్ చేయడానికి కారకుడవుతున్నాడీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్. మిడిలార్డర్‌లో పిడుగుల్లాంటి షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లను ఆడిన హెట్మెయిర్ ఏడుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. 291 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. 59 పరుగులు అతని వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్.. ఈ సీజన్‌లో. 166.29 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడీ వెస్టిండీయన్. భార్య నిర్వాణికి నెలలు నిండటంతో రెండు రోజుల కిందటే తన స్వదేశం గయానాకు బయలుదేరి వెళ్లాడు. ఈ తెల్లవారు జామున గయానా కంబర్లాండ్‌లోని స్థానిక ఆసుపత్రిలో నిర్వాణి ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

మళ్లీ హెట్మెయిర్ భారత్‌కు తిరుగు ప్రయాణమౌతాడు. రాజస్థాన్ రాయల్స్ ఆడే తరువాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్‌లో పింక్ టీమ్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో ఏడింట్లో విజయం సాధించింది. 14 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది ఈ సంజుశాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్. ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి రాజస్థాన్‌కు. తన తదుపరి మ్యాచ్‌ను ఢిల్లీ కేపిటల్స్‌తో ఆడనుంది. బుధవారం సాయంత్రం 7:30 గంటలకు నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడే మ్యాచ్‌లతో తన లీగ్ దశను ముగించుకుంటుంది. కాగా ఢిల్లీ కేపిటల్స్‌తో మ్యాచ్ నాటికి షిమ్రోన్ హెట్మెయిర్ భారత్‌కు తిరిగి వస్తాడు. తుదిజట్టులోకి తీసుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

Story first published: Tuesday, May 10, 2022, 9:40 [IST]
Other articles published on May 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X