
బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలం ఘనంగా ప్రారంభమైంది. వేలంలో దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. 2 కోట్ల రూపాయల కనీస ధరతో మెగా వేలంలోకి వచ్చిన క్వింటన్ డికాక్ను లక్నో సూపర్ జెయింట్స్ 6 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. వేలంలో డికాక్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. మధ్యలో ముంబై ఇండియన్స్ కూడా రేసులోకి వచ్చింది. 4 కోట్ల రూపాయల నుంచి డికాక్ కోసం ముంబై పోటీ పడింది. కానీ 5 కోట్ల రూపాయలకు చేరుకోగానే పోటీ నుంచి తప్పుకుంది. దీంతో మళ్లీ లక్నో, సీఎస్కే మధ్య పోటీ నడిచింది. చివరకు ఐపీఎల్లోకి ఈ సారి కొత్తగా ప్రవేశించిన లక్నో సూపర్ జెయింట్స్ 6 కోట్ల 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.
గత సీజన్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన డికాక్కు ఆ జట్టు 2 కోట్ల 80 లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ సారి 6 కోట్ల 75 లక్షల రూపాయల ధర పలికాడు. దీంతో డికాక్కు గతంలో కన్న రెండింతలకు పైగా ఎక్కువ ధర లభించింది. ఈ సారి గతంలో కన్నా 3 కోట్ల 95 లక్షల రూపాయల ధర ఎక్కువగా లభించింది. ఇక మెగా వేలం ముందు భారత ఆటగాళ్లతోనే ప్రారంభమైంది. వేలంలో మొదటగా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు. ధావన్ను పంజాబ్ కింగ్స్ 8 కోట్ల 25 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రెండో ప్లేయర్గా అశ్విన్ వేలంలోకి వచ్చాడు. అశ్విన్ను 5 కోట్ల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.