
రోహిత్ సేనకు లైఫ్ అండ్ డెత్ గేమ్..
ఇవ్వాళ ముంబై ఇండియన్స్ తన అయిదో మ్యాచ్ ఆడనుంది. పంజాబ్ కింగ్స్తో తలపడటానికి సమాయాత్తమౌతోంది. పాయింట్స్ టేబుల్ కొలీగ్ చెన్నై సూపర్ కింగ్స్ తరహాలోనే వరుసగా నాలుగు పరాజయాలకు బ్రేక్ వేస్తుందా? లేక.. అధ్వాన్నపు ఫామ్ను కొనసాగిస్తుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది. ముంబై ఇండియన్స్కు ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్. ఈ మ్యాచ్లో గెలవడమే కాదు.. ఇకపై అన్నింట్లోనూ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది రోహిత్ సేన.

మహారాష్ట్రను దాటని మ్యాచ్లు..
ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లేవీ ముంబై, పుణేలను దాటట్లేదు. ఈ రెండు నగరాలకే పరిమితం అయ్యాయి. ముంబైలోని వాంఖెడె, బ్రబౌర్న్, నవీముంబైలోని డీవై పాటిల్, పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాల్లో లీగ్ దశ మ్యాచ్లనింటినీ నిర్వహిస్తోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇందులో మార్పులు చేర్పులు చేసింది. లీగ్ దశ దాటిన తరువాత మ్యాచ్లన్నీ వేర్వేరు స్టేడియాలకు షిఫ్ట్ కానున్నాయి. ఈ విషయాన్ని బీసీీసీఐ వర్గాలు ధృవీకరించాయి.

అహ్మదాబాద్లో..
ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఐపీఎల్ సీజన్ ఫైనల్స్ను నిర్వహించనుంది బీసీసీఐ. రెండో క్వాలిఫయర్, ఎలిమినేటర్ కూడా అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంది. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ను కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్కు షిఫ్ట్ చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వాళో.. రేపో వెలువడవచ్చు. ఇదివరకు తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ను లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా స్టేడియంలో నిర్వహించాలని భావించినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు.

కోల్కతలో..
లక్నోకు బదులుగా కోల్కతను సెలెక్ట్ చేసుకుంది బీసీసీఐ. వచ్చే నెల 22వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్లు కొనసాగుతాయి. ఆ తరువాత క్వాలిఫయర్ టీమ్స్ మహారాష్ట్రను వీడాల్సి ఉంటుంది. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్లో తలపడే జట్లు ముంబై నుంచి నేరుగా కోల్కతకు బయలుదేరి వెళ్తాయి. బయో సెక్యూరిటీ బబుల్ మధ్యే ఈ ప్రయాణ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేసిన ప్లేయర్ ఖచ్చితంగా మూడు రోజుల పాటు క్వారంటైన్ కాలాన్ని గడపాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications












