సన్రైజర్స్లోకి గుప్తిల్, బౌల్ట్
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లైనా మార్టిన్ గుప్టిల్, ట్రెంట్ బౌల్ట్ ఈ సారి ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున ఆడబోతున్నారని సమాచారం. ఇందు కోసం టీం మేనేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. వేలంలో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లను కోనుగోలు చేయాలని రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది. మంచి బ్యాటర్ అయినా గుప్తిల్, మంచి పేస్ బౌలర్ అయినా బౌల్ట్ జట్టులో ఉంటే టీం బలంగా తయారవుతుందని రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తోందని సమాచారం. దీనికితోడు ఇప్పటికే వీరిద్దరు మ్యాచ్ విన్నర్లు. అంతకు మించిన అనుభవం కూడా ఉంది. దీంతో అన్ని విధాలుగా గుప్తిల్, బౌల్ట్ టీంకు ప్లస్ అవుతారని సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
కేన్ మామ కీలకపాత్ర
గుప్తిల్, బౌల్ట్ సన్రైజర్స్ జట్టు తరఫున ఆడడంలో కేన్ మామ కీలకపాత్ర పోషిస్తున్నాడని సమాచారం. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్.. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సనే కావడంతో ఈ ఇద్దరు కివీస్ స్లార్ ప్లేయర్లు గుప్తిల్, బౌల్ట్ కూడా సన్రైజర్స్లో ఆడడానికి మార్గం సుగుమమైందని తెలుస్తోంది. ఈ మేరకు సన్రైజర్స్ మేనేజ్మెంట్ కోరడంతో గుప్తిల్, బౌల్ట్తో మాట్లాడి విలియమ్సన్ ఒప్పించాడట. విలియమ్సన్ అడిగే సరికి వాళ్లు కూడా కాదనలేక పోయారట. కివీస్ జట్టులో తనతోపాటు ఉండే గుప్తిల్, బౌల్ట్ సన్రైజర్స్లోనూ ఉంటే జట్టుకు బలంగా ఉంటుందని కేన్ మామ భావిస్తున్నాడట. దీంతో ఇక వేలంలో ఎంత ధరైనా గుప్తిల్, బౌల్ట్ను కొనుగోలు చేయాలని సన్రైజర్స్ డిసైడ్ అయిందని సమాచారం.
బౌల్ట్, గుప్తిల్ రికార్డులు
గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ట్రెంట్ బౌల్ట్కు ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో బౌల్ట్ మెగా వేలానికి రానున్నాడు. కాగా ముంబై ఇండియన్స్లో బౌల్ట్ కీలక బౌలర్గా రాణించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఇప్పటివరకు 62 మ్యాచ్లు ఆడిన గుప్తిల్ 76 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/18. ఇక ఐపీఎల్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు మాత్రమే ఆడిన గుప్తిల్ 22 సగటుతో 270 పరుగులు చేశాడు.
ధర ఎంతంటే?
గతేడాది ట్రెంట్ బౌల్ట్కు ముంబై ఇండియన్స్ 3.2 కోట్ల రూపాయలు చెల్లించింది. గత ఏడాది రాణించడంతో ఈ సారి వేలంలో బౌల్ట్కు భారీ ధర పలికే అవకాశం ఉంది. బౌల్ట్ కోసం 8 కోట్ల రూపాయలు చెల్లించడానికి సన్రైజర్స్ హైదరాబాద్ సిద్ధంగా ఉందని సమాచారం. అలాగే స్టార్ బ్యాటర్ అయినా గుప్తిల్ కోసం కూడా భారీగా చెల్లించనుందట. గుప్తిల్కు 5 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాలని సన్రైజర్స్ హైదరాబాద్ యాజామాన్యం భావిస్తోందని తెలుస్తోంది.