జట్టులో చేరిన కేఎల్ రాహుల్
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2022 కోసం ఆ జట్టు క్యాంపులో చేరాడు. అయితే కరోనా నిబంధనల ప్రకారం ముందుగా 3 రోజుల క్వారంటైన్లో చేరాడు. ఈ సందర్భంగా టీం గురించిన పలు ఆసక్తిర విషయాలను రాహుల్ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. "అందరికీ హాయ్, ఇక్కడ కేఎల్.
ఈ ఉదయం లక్నో సూపర్ జెయింట్స్ బబుల్లోకి ప్రవేశించాను. నిజంగా ఈ మూడు రోజులు త్వరగా ముగియాలని ఆశిస్తున్నాను. అనంతరం నేను బయటకు వచ్చి టీం స్క్వాడ్ని కలుసుకుంటాను. వచ్చే రెండు నెలలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. కుర్రాళ్లందరితో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది' అని రాహుల్ సదరు వీడియోలో పేర్కొన్నారు.
ప్రత్యేకంగా చేయడానికి అవకాశం
"మేమంతా కలిసి విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం. కొత్త సీజన్ కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి కొత్త ఫ్రాంచైజీగా మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. జట్టులోని ప్రతి ఒక్కరూ దీన్ని చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. సీజన్ కోసం ఇంకా వేచి ఉండలేకపోతున్నాం. తామంతా మైదానంలోకి దిగి గేమ్లు గెలవడం కోసం వేచి ఉండలేము, " అని రాహుల్ చెప్పాడు. కాగా మెగా వేలానికి ముందే 17 కోట్ల రూపాయల భారీ ధరను వెచ్చించి కేఎల్ రాహుల్ను కొత్త ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
లక్నో పూర్తి జట్టు ఇదే
కేఎల్ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టొయినిస్ (9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), అవేశ్ ఖాన్ (10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య (8.25 కోట్లు), మార్క్ వుడ్ (7.50 కోట్లు), క్వింటన్ డికాక్ ( 6.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు), మనీశ్ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్ మయేర్స్ (50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్సిన్ ఖాన్ ( వీరందరికీ 20 లక్షలు).