
జట్టుకు ఏం చేయాలనేదే ఇంపార్టెంట్
'మెగా వేలం తర్వాత ఒకట్రెండు రోజులు అత్యధిక ధర పలికామన్న ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి ఉండడం సహజం. కానీ ప్రస్తుతం నేను ప్రైస్ ట్యాగ్ విషయాన్ని ఏమాత్రం దృష్టిలో ఉంచుకోవట్లేదు. మా జట్టు గెలవడానికి నేను ఏవిధంగా సహాయపడాలనే దానిపై మాత్రమే నేను దృష్టి పెడుతున్నా. ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి కచ్చితంగా కొన్ని రోజులు ఉంటుంది.. కానీ నా చుట్టూ మంచి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారని, వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి నాకు తగినంత మోటివేషన్ లభిస్తుంది' అని ఇషాన్ పేర్కొన్నాడు.

నీకంత ధర పెట్టాలని నువ్వేం కోరలేదుగా
'నేను రోహిత్ భాయ్, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాలతో మాట్లాడినప్పుడు, అందరూ నాతో ఒకటే చెప్పారు. నువ్వు నీ ప్రైస్ ట్యాగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే నీకంత ధర పెట్టాలని నువ్వేం టీంను కోరలేదు. టీమ్కి నీపై నమ్మకం ఉంది కాబట్టి వారు అంత డబ్బు పెట్టారు. డబ్బు కన్నా వారు నీ మీద ఉంచుకున్న నమ్మకమే ముఖ్యం' అని తనకు సూచించారని ఇషాన్ తెలిపాడు.

సీనియర్లతో మాట్లాడడం ఉపయోగపడింది
ఈ ఐపీఎల్ సీజన్లో ఇషాన్ కిషన్ 11ఇన్నింగ్స్లలో 321పరుగులు చేశాడు. అయితే అతని స్ట్రైక్ రేట్ 117.15తో చాలా పేలవంగా ఉంది. 'ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి గురించి ఆలోచించే బదులు, నా ఆట ఏంటో నా పరిధి ఏంటో దాని గురించే ఆలోచించడం ముఖ్యం. ఈ విషయంలో సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడటం నిజంగా సహాయపడింది. వారు చాలాకాలం పాటు క్రికెట్ ఆడుతున్నారు. విభిన్న పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో వాళ్లు వేలంలో వారికి పలికిన ధర వల్ల కొంత ఒత్తిడి ఎదుర్కొనే ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో వారు పరిస్థితిని ఎలా నిర్వహించారో వారి ద్వారా తెలుసుకున్నాను' అని ఇషాన్ తెలిపాడు.


Click it and Unblock the Notifications
