కోహ్లీ, డుప్లిసెస్ను ఓడించిన హర్షల్
ప్రాక్టీస్ సెషన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ హర్షల్ పటేల్ మధ్య ప్రాక్టీస్ సెషన్లో సిక్సులు కొట్టే చాలెంజ్ నడిచింది. అయితే ఈ చాలెంజ్లో ఆశ్చర్యకరంగా బౌలర్ హర్షల్ పటేల్ విజేతగా నిలవడం గమనార్హం. మొత్తం 6 బంతులకు గాను హర్షల్ పటేల్ 3 సిక్సులు కొట్టి ఫాఫ్ డుప్లిసెస్, విరాట్ కోహ్లీని ఓడించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

కొత్త కెప్టెన్ అధ్వర్యంలో
ఇక ఈ సారి ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నూతన కెప్టెన్ అధ్వర్యంలో బరిలోకి దిగబోతుంది. గతంలో ఆ జట్టును నడిపించిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డుప్లిసెస్కు ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఈ సీజన్లో ఆర్సీబీని డుప్లిసెస్ ఎలా నడిపిస్తాడనే ఆసక్తి అంతటా నెలకొంది.
ముఖ్యంగా ఇప్పటివరకు ఒక్క సారి కూడా ట్రోఫీ గెలవలేకపోయిన ఆర్సీబీ నిరీక్షణకు డుప్లిసెస్ తెరదించాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్సీబీని డుప్లిసెస్ ఐపీఎల్ 2022 ట్రోఫీ విజేతగా నిలబెట్టాలని ఆశిస్తున్నారు. కాగా ఐపీఎల్లో డుప్లిసెస్ ఇప్పటివరకు ఎప్పుడూ కెప్టెన్సీ చేయకపోయినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం సౌతాఫ్రికా సారథిగా పని చేశాడు. ఆ జట్టుకు అనేక విజయాలు అందించాడు.

ఆర్సీబీ పూర్తి జట్టు
విరాట్ కోహ్లీ (15 కోట్లు), మ్యాక్స్వెల్తో (11 కోట్లు), మహమ్మద్ సిరాజ్ (7 కోట్లు), వానిందు హసరంగ (10.75 కోట్లు), హర్షల్ పటేల్ (10.75 కోట్లు), డుప్లెసిస్ ( 7 కోట్లు), దినేశ్ కార్తీక్ (5.5 కోట్లు), జోష్ హేజిల్ వుడ్ (7.75 కోట్లు), షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు), అనుజ్ రావత్ (3.4 కోట్లు), డేవిడ్ విల్లే ( 2 కోట్లు), షెర్ఫానే రూథర్ఫోర్డ్ (కోటి) మహిపాల్ లామ్రోర్ (95 లక్షలు), ఫిన్ అలెన్ ( 80 లక్షలు), జేసన్ బెహ్రెండోర్ఫ్ ( 75 లక్షలు), సిద్ధార్థ్ కౌల్ (75 లక్షలు), కర్ణ్ శర్మ (50 లక్షలు), చామ మిలింద్ (25 లక్షలు), సుయాశ్ ప్రభుదేశాయ్ (30 లక్షలు), ఆకాశ్ దీప్, అనీశ్వర్ గౌతమ్, లువ్నిత్ సిసోడియా(వీరందరికీ 20 లక్షలు).


Click it and Unblock the Notifications












