ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆ జట్టు ఆటగాళ్లంతా మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్కు ఓ శుభవార్త అందింది. మెగా వేలంలో ఆ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసిన స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గాయం కారణంగా పాకిస్థాన్తో వన్డే సిరీస్కు దూరమైన ఈ ఆస్ట్రేలియా ఆటగాడు తాజాగా కోలుకున్నాడు. దీంతో అతను శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే మ్యాచ్లో మార్ష్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్కు బలం పెరగనుంది. కాగా ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో మిచెల్ మార్ష్ కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్లో విన్నింగ్ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. దీంతో మెగా వేలంలో మిచెల్ మార్ష్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.5 కోట్ల రూపాయల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది.
ఇక ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 2 గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడో స్థానంలో ఉంది. 5 మ్యాచ్ల్లో 4 గెలిచిన గుజరాత్ టైటాన్స్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదేసి మ్యాచ్ల చొప్పున మూడేసి మ్యాచ్ల్లో విజయం సాధించాయి. వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. రెండేసి విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఏడు, ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఒక విజయం సాధించిన చెన్నైసూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో, ఒక మ్యాచ్ కూడా గెలవని ముంబై ఇండియన్స్ పదో స్థానంలో ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు
రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, అభిషేక్ శర్మ, కమలేష్ నాగర్కోటి, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్, ఖలీల్ సద్కావ్, చేతన్ యాడ్కావ్, చేతన్ యాహ్మద్ , రిపాల్ పటేల్, యష్ ధుల్, రోవ్మన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎన్గిడి, విక్కీ ఓస్త్వాల్, సర్ఫరాజ్ ఖాన్.