
ధోనీ ఆ షాట్..
ఈ మ్యాచ్లో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్. సచిన్ టెండుల్కర్ చేసింది 18 పరుగులే. 31 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయిన దశలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ.. రాణించారు. ఇన్నింగ్ను నిలబెట్టారు. గంభీర్-97, విరాట్ కోహ్లీ-35 పరుగులు చేశారు. ఇక ఎంఎస్ ధోనీ 79 బంతుల్లో 91 పరుగులు చేసి.. నాటౌట్గా నిలిచాడు. మ్యాచ్ విన్నింగ్ షాట్గా ధోనీ కొట్టిన హెలికాప్టర్ షాట్.. ఎన్నేళ్లయినప్పటికీ మరిచిపోలేనిది.

ప్రపంచకప్కే కేరాఫ్గా..
ఈ విజయం తరువాత- ఎంఎస్ ధోనీ పేరు మార్మోగిపోయింది. ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొని ఉంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచ కప్ను గెలిచిన తరువాత మళ్లీ ధోనీ సారథ్యంలోని టీమిండియా అదే ఘనతను సాధించడాన్ని ప్రతి అభిమాని ఆస్వాదించాడు. ధోనీ కీలకమైన ఇన్నింగ్ ఆడటం వల్లే టీమిండియా ప్రపంచ కప్ను సాధించిందంటూ కీర్తించారు. ధోనీ అంటే ప్రపంచకప్, ప్రపంచకప్ అంటే ధోనీలా మారిపోయింది.
తప్పుపట్టిన హర్భజన్
ఈ పరిస్థితిని టర్బొనేటర్ హర్భజన్ సింగ్ తప్పు పట్టాడు. ధోనీ వల్లే టీమిండియా ప్రపంచ కప్ గెలిచిందనే విషయాన్ని తాను ఎప్పటికీ అంగీకరించబోనని స్పష్టం చేశాడు. భారత్ ఈ ఘనతను సాధించడానికి ధోనీ ఒక్కడే కారణం అనడం అర్థం లేదని వ్యాఖ్యానించాడు. అది జట్టు సమష్టి కృషి అని చెప్పుకొచ్చాడు. టీమిండియా సమష్టిగా రాణించడం వల్లే ప్రపంచకప్.. భారత్ వశమైందని చెప్పాడు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నాడు.

మిగిలిన వాళ్లేం కావాలి?
ఐపీఎల్ 2022 డిబేట్స్లో పాల్గొన్న హర్భజన్ సింగ్ తన మనసులో మాటను బయటపెట్టాడు. ధోనీ ఒక్కడే మ్యాచ్ గెలిపించాడంటే.. మిగిలిన ప్లేయర్లు ఏం కావాలి? అంటూ ప్రశ్నించాడు. గౌతమ్ గంభీర్ 97 పరుగులను గుర్తు చేశాడు. జట్టులో ఉన్న మిగిలిన 10 ప్లేయర్లు ఆడలేదా అని నిలదీశాడు. జట్టు మొత్తంగా ఆడినప్పుడే విజయం సిద్ధిస్తుందని చెప్పాడు. ఆ విజయాన్ని ఏ ఒక్క ఆటగాడికో పరిమితం చేయలేమని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా గెలిస్తే.. ఆ జట్టు పేరు చెప్పుకొంటారు.. టీమిండియా కప్ కొడితే.. ధోనీ పేరు చెప్పుకోవడం సరికాదని స్పష్టం చేశాడు భజ్జీ.


Click it and Unblock the Notifications
