
నిరాశలో రైనా ఫ్యాన్స్
గతేడాది వరకు ఐపీఎల్లో సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు రైనా ఒక్క సీఎస్కే తరఫున మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో మిస్టర్ ఐపీఎల్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆ జట్టు లేని రెండు సీజన్లు మాత్రం గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. సీఎస్కే విజయాల్లో రైనా కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సారి రైనాను ఆ జట్టు రిటైన్ చేసుకోక పోవడంతో మెగా వేలంలోకి వచ్చాడు. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్తో వేలంలోకి రాగా ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. సీఎస్కే కూడా పట్టించుకోలేదు. వేలంలోకి వచ్చినప్పటికీ సీఎస్కే మళ్లీ కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. కానీ అది జరగకపోవడంతో రైనా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

కారణమిదేనే
ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయకపోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సురేష్ రైనా ఫాంలో లేడు. దీనికి తోడు ఇటీవల ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఇక గత సీజన్లో కూడా రైనా దారుణంగా విఫలమయ్యాడు. అలాగే ఈ సీజన్లో రాణిస్తాడనే నమ్మకాన్ని కూడా ఫ్రాంచైజీలకు కల్పించలేకపోయాడు. దీనికి తోడు 2020లో ఇండియాలో కరోనా కారణంగా యూఏఈలో లీగ్ జరిగినప్పుడు రైనా మ్యాచ్లు మొదలవకుండానే స్వదేశానికి తిరిగొచ్చేశాడు. దీంతో ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడితే రైనా జట్టుకు అందుబాటులో ఉండడని కూడా ఫ్రాంచైజీలు భావించాయని తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ కారణాలన్నింటిని దృష్టిలో పెట్టుకునే రైనాను ఏ ఫ్రాంచైజీ దక్కించుకోలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

రైనా రికార్డులు
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకడు. ఈ లీగ్లో ఇప్పటివరకు 205 మ్యాచ్లు ఆడిన రైనా 32 సగటుతో 5528 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో 506 ఫోర్లు బాదిన రైనా, 203 సిక్సులు కొట్టాడు. బౌలర్గానూ 13 వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications












